ఖలీల్వాడి అక్టోబర్ 19: బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ఆర్టీసీకి నిజామాబాద్ రీజియన్ పరిధిలో సుమారు కోటి రూపాయల ఆదాయం వచ్చిందని ఆర్ఎం సుధా పరిమళ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సాధారణ చార్జీలతోనే ప్రత్యేక సర్వీసులను నడిపినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులకు సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చామని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని నాలుగు డిపోలు, కామారెడ్డి జిల్లాలోని రెండు డిపోలు కలిపి మొత్తం రూ. కోటీ 3 లక్షల19, 377 ఆదాయం వచ్చిందని వివరించారు.