ఎల్లారెడ్డి రూరల్/ నాగిరెడ్డిపేట్/ లింగంపేట/సదాశివనగర్, సెప్టెంబర్ 19 : కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతున్నది. గ్రామాల్లో వైద్యసిబ్బంది ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి టీకాలు వేస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని 12 వార్డులతో పాటు లింగారెడ్డిపేట్, అల్మాజీపూర్, శివ్వానగర్, మీసన్పల్లి, వెంకటాపూర్ అగ్రహారం, అడవి లింగాల్, గండిమాసానిపేట్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటుచేసి మొత్తం 389 మందికి టీకాలు వేశామని వైద్యసిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, కమిషనర్ జగ్జీవన్, మత్తమాల మెడికల్ ఆఫీసర్ వెంకటస్వామి, హెల్త్ సూపర్వైజర్ వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. నాగిరెడ్డిపేట్ మండలంలోని జాన్కంపల్లి గ్రామంలో కొనసాగుతున్న కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎంపీడీవో రఘు పరిశీలించారు. లింగంపేట మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం 354 మందికి కొవిడ్ టీకాలు వేశామని పీహెచ్సీ వైద్యురాలు సమీనా తెలిపారు. లింగంపేటలో 28 మందికి, ఐలాపూర్లో 10, లింగంపల్లిలో 44, సురాయిపల్లిలో 34, రాంపల్లి తండాలో 45, శెట్పల్లి 30, శెట్పల్లిసంగారెడ్డిలో 67, బాణాపూర్లో 35, భవానీపేటలో 41, ముంబాజీపేట తండాలో 20 మందికి టీకాలు వేసినట్లు వివరించారు. సదాశివనగర్ మండలకేంద్రంతో పాటు పద్మాజివాడి, కల్వరాల్, కుప్రియాల్, ధర్మారావుపేట్, మల్లుపేట్, మోడెగామ గ్రామాల్లో కొవిడ్ టీకాలు వేశారు. సదాశివనగర్ పీహెచ్సీ పరిధిలోని గ్రామాల్లో 95 శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేశామని డాక్టర్ ఇద్రిస్ ఘోరీ తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకట్రావు వైద్య సిబ్బందిని అభినందించారు.
వ్యాక్సినేషన్ను వంద శాతం పూర్తిచేయాలి..
విద్యానగర్, సెప్టెంబర్ 19 : జిల్లాకేంద్రంలోని సీనియర్ సిటిజన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ శిబిరాన్ని డీఎంహెచ్వో చంద్రశేఖర్ పరిశీలించారు. జిల్లాలో వ్యాక్సినేషన్ను వంద శాతం పూర్తిచేయాలన్నారు. ఆయన వెంట వైద్యసిబ్బంది ఉన్నారు.