ఇందూరు, అక్టోబర్ 17: వహీద్ మెమోరియల్ జాతీయ ఇన్విటేషన్ ఫుట్బాల్ టోర్నమెంట్ విజేతగా తమిళనాడు జట్టు, రన్నరప్గా ఆతిథ్య జట్టు కేర్ ఫుట్బాల్ అకాడమీ జట్టు నిలిచాయి.నిజామాబాద్ జిల్లా కేంద్ర శివారులోని రాజారాం స్టేడియంలో కేర్ ఫుట్బాల్ అకాడమీ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయిఫుట్బాల్ టోర్నీ ఆదివారం ముగిసింది. ఫైనల్ మ్యాచ్లో ఆతిథ్య జట్టు, తమిళనాడు జట్లు తలపడ్డాయి. ఉత్కంఠగా సాగిన ఈ పోరులో తమిళనాడు జట్టు విన్నర్గా నిలిచింది. మ్యాచ్ మొదటి భాగంలో తమిళనాడు రెండు గోల్స్ సాధించి ఆధిక్యం కొనసాగించింది. ద్వితీయార్థంలో ఆతిథ్య జట్టు కేర్ ఫుట్బాల్ అకాడమీ అత్యద్భుతంగా పోరాడి తమిళనాడు ఆధిక్యాన్ని నిలువరించింది. మరొక గోల్ సాధించడంతో తమిళనాడు ఆధిక్యం 3-0కు పెరిగింది. చివరికి తమిళనాడు జట్టు 3-0 తో గెలిచి తొలి వహీద్ మెమోరియల్ జాతీయ ఇన్విటేషన్ ఫుట్బాల్ టోర్నమెంట్ విజేతగా నిలిచింది.
ఉమ్మడి విజేతలుగాహైదరాబాద్ తెలంగాణ, కేరళ జట్లు
ఉదయం వర్షంతో మైదానం బురదమయంగా మారడంతో మూడో స్థానానికి పోటీ నిర్వహించలేకపోయారు. దీంతో హైదరాబాద్ తెలంగాణ, కేరళ జట్లను నిర్వాహకులు ఉమ్మడి విజేతలుగా ప్రకటించారు. ఫైనల్ మ్యాచ్కు ముఖ్యఅతిథిగా ధ్యాన్చంద్ అవార్డు గ్రహీత, భారత ఫుట్బాల్ మేనేజర్, భారత దేశ మాజీ ఫుట్బాల్ క్రీడాకారుడు షబ్బీర్ అలీ హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు.కార్యక్రమంలో రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఫాల్గుణ, అథ్లెటిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నరాల రత్నాకర్, నిజామాబాద్ ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు షకీల్, మాజీ డిప్యూటీ మేయర్ ఫహీమ్, నిజామాబాద్ ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఖలీల్, ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి ఆం ద్యాల లింగం, సుబ్బారావు, సాయాగౌడ్, గిరి, ప్రశాంత్, ఫారూక్, ఎజాజ్, అన్వర్, జావిద్, ఖాలేద్, అశ్వాక్ తదితరులు పాల్గొన్నారు.