కోటగిరి, అక్టోబర్ 17 : వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో కొవిడ్ వ్యాక్సినేషన్ జోరుగా కొనసాగుతున్నది. గ్రామాల్లో గత నెలలో ప్రారంభమైన వ్యాక్సినేషన్కు మంచి స్పందన లభిస్తున్నది. మండలంలోని 28 గ్రామ పంచాయతీల పరిధిలో ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉంటూ ప్రజలకు టీకా వేస్తున్నారు. ఊర్లలో మొదటి, రెండో డోసు టీకా ప్రతి ఒక్కరికీ ఇస్తున్నారు. 18 ఏండ్లు నిండిన వారందరూ టీకా వేయించుకోవాలని అధికారులు, ప్రజాప్రతినిధులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. వైద్యశాఖ, పంచాయతీ, అంగన్వాడీ సిబ్బంది వ్యాక్సినేషన్లో నిమగ్నమయ్యారు. ఎంపీడీవో, ఎంపీవో తదితర అధికారులు వ్యాక్సినేషన్ను పర్యవేక్షిస్తున్నారు.
నిమిషాల్లోనే టీకా..
వ్యాక్సినేషన్ సెంటర్లను ప్రతి వార్డులోని, కమ్యూనిటీ హాళ్లలో ఇతర సామాజిక భవానాల్లో ఏర్పాటు చేయడంతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతున్నది. సెంటర్కు వచ్చిన 20 నిమిషాల్లోనే వ్యాక్సినేషన్ పూర్తవుతుండడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజాప్రతినిధుల ప్రత్యేక చొరవ..
వ్యాక్సినేషన్ పూర్తిచేసేందుకు ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని అవగాహన కల్పిస్తూ వైద్యారోగ్యశాఖకు తమవంతు సహకారం అందజేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా, గ్రామాల్లో దండోరా వేయిస్తూ అవగాహన కల్పిస్తున్నారు.
11సబ్ సెంటర్లు.. 13,004 మందికి టీకా
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గత నెల16న ప్రారంభమైన స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఇప్పటి వరకు 13,004 మంది కి టీకా వేసినట్లు సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. మరో 7,006 వేల మందికి టీకా వేయాల్సి ఉందన్నారు.
వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేస్తాం
కోటగిరి మండలంలోని 11 సబ్ సెంటర్లలో వ్యాక్సినేషన్ ప్రక్రియ విస్తృతంగా కొనసాగుతున్నది. ప్రజల నుంచి స్పందన బాగుంది. ప్రజాప్రతినిధుల సహకారంతో వందశాతం వ్యాక్సినేషన్ను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.