ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వినాయక నవరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మండపాల్లో వివిధ రూపాల్లో ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గణేశ్ మండళ్ల నిర్వాహకులు మండప ముఖద్వారాలను కూడా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. మిరిమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు, భారీ సెట్టింగ్లను ఏర్పాటు చేశారు.