మెండోరా, సెప్టెంబర్ 14: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 23,694 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోందని ప్రాజెక్టు ఏఈఈ వంశీ తెలిపారు.దీంతో ప్రాజెక్ట్ ఆరు వరద గేట్లను ఎత్తి దిగువ గోదావరిలోకి 18,720 క్యూసెక్కుల మిగుల జలాలను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్కేప్ గేట్ల నుంచి నాలుగు వేల క్యూసెక్కుల నీటివిడుదల కొనసాగుతోందన్నారు. కాకతీయ కాలువకు 3500 క్యూసెక్కులు, సరస్వతీ కాలువకు 800, లక్ష్మీ కాలువకు 80 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోందని తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా మంగళవారం సాయంత్రానికి 1090.90 అడుగుల (89.763 టీఎంసీల) వద్ద ఉందన్నారు. ఎగువ ప్రాంతం నుంచి ఎస్సారెస్పీలోకి ఈ సీజన్లో 296.003 టీఎంసీల వరద వచ్చిందని తెలిపారు. 224.677టీఎంసీల మిగుల జలాలను కాలువ, గోదావరిలోకి విడుదల చేశామని ఏఈఈ పేర్కొన్నారు.