నిజామాబాద్ సిటీ, అక్టోబర్ 13 : ఈనెల 25వ తేదీ నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేలోని తన చాంబర్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడారు. కొవిడ్ నేపథ్యంలో గతేడాది మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించలేకపోడంతో, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 25నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నవంబర్ 1వ తేదీ వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతోపాటు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు తదితర సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.
నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు డీసీపీ గిరిరాజ్, ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్ఎస్ఎఫ్ భూముల పరిశీలన
రెంజల్, అక్టోబర్ 13 : మండలంలోని వీరన్నగుట్ట, రెంజ ల్ గ్రామాల్లో ఉన్న ఎన్ఎస్ఎఫ్ భూములను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ బుధవారం పరిశీలించారు. వీరన్నగుట్ట గ్రామానికి చెందిన సూర్యనారాయణ సర్వేనంబర్ 111లో 5.02 గుంటల ఎన్ఎస్ఎఫ్ ప్రభుత్వ భూమిని కొనుగోలు చేశాడు. ఈ భూమి నిషేధిత భూముల జాబితాలో చేర్చడం తో భూములను కొనుగోలు అమ్మకాలు చేపట్టరాదని తెలిపా రు. దీంతో సూర్యనారాయణ నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలని దరఖాస్తు చేసుకున్నాడు. కలెక్టర్ ఆదేశాల మేర కు అడిషనల్ కలెక్టర్ భూములను పరిశీలించి నివేదికను కలెక్టర్కు సమర్పిస్తానని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ వెంట తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.