నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్టుకు చెందిన మూడు వరద గేట్ల ద్వారా 14,900 క్యూసెక్కుల నీటిని మంజీరాలోకి విడుదల చేస్తున్నట్లు నీటి పారుదల శాఖ ఈఈ సోలోమాన్ తెలిపారు. సెప్టెంబర్ 8వ తేదీన నీటి విడుదలను మంజీరాలోకి ప్రారంభించామని ఇప్పటి వరకు సుమారు 60 టీఎంసీల నీటిని విడుదల చేశామని వెల్లడించారు. ఎన్నడూ లేనంతగా ఈ సంవత్సరం నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగం నుంచి భారీగా ఇన్ఫ్లో రావడంతో నిరంతరాయంగా నీటిని విడుదల చేస్తున్నామని అన్నారు.
ఎగువ భాగంనుంచి వస్తున్న ఇన్ఫ్లోకు అనుగుణంగా దిగువకు నీటిని విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1405.00 అడుగులు 17.80 టీఎంసీల పూర్తిస్థాయిలో నిజాంసాగర్ నిండి ఉందని ఆయన పేర్కొన్నారు.