ఇందూరు: క్రీడాకారులను ప్రోత్సహించడం గొప్ప విషయమని నిజామాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రసేన్రెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని స్థానిక కేర్ డిగ్రీ కళాశాలలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఫుట్బాల్ క్రీడాకారులకు క్రీడా సామగ్రిని చంద్రసేన్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు తులసిరెడ్డి తన వంతు సహకారంగా రూ.4లక్షల విలువైన క్రీడా సామగ్రిని వితరణగా ఇవ్వడం గొప్ప విషయమన్నారు. సభాధ్యక్షుడు, నిజామాబాద్ ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు షకిల్ మాట్లాడుతూ జిల్లాలో ఫుట్బాల్కు కేర్ ఆఫ్ అడ్రస్గా కేర్ ఫుట్బాల్ అకాడమీ మారిందన్నారు. అకాడమీ ఇంతగా ఎదగడానికి కోచ్ నాగరాజు కృషే కారణమని కేర్ ఫుట్బాల్ అకాడమి అధ్యక్షుడు నరాల సుధాకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త వేద్ప్రకాశ్, ఘనపురం దేవేందర్, శంభుని గుడి చైర్మన్ మహేందర్, క్రీడాకారులు పాల్గొన్నారు.