దళితుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చిన దళితబంధు పథకాన్ని బీజేపీ, ఈటల రాజేందర్ కుట్రలు చేసి నిలిపివేయించడంపై నియోజకవర్గ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. పలు చోట్ల ఈటల దిష్టిబొమ్మల దహనంతో దళితుల్లో ఆగ్రహజ్వాలలు ఎగిసిపడ్డాయి. బీజేపీ తాము తినే కంచంలో మన్ను పోసిందని, ఉప ఎన్నికలో ఈటలను ఓడించి తమ తడాఖా చూపిస్తామన్న హెచ్చరికలు దళిత సంఘాల నుంచి వ్యక్తమయ్యాయి.
హుజూరాబాద్ రూరల్, అక్టోబర్ 19: హుజూరాబాద్ మండలం చెల్పూర్, కనుకులగిద్ద, కందుగులతో పాటు పలు గ్రామాల్లో ఈటల రాజేందర్ దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించారు. వాటిని దహనం చేశారు. పెద్దపాపయ్యపల్లి గ్రామంలోని అంబేద్కర్ యువజన సంఘం భవనానికి ఈటల చిత్రపటాన్ని కట్టి నిరసన తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ఆయా గ్రామాల దళితులు చల్లూరి శరబందం, పాపయ్య, బత్తుల విష్ణువర్ధన్, రాములు, రాజయ్య, భిక్షపతి, రవి, సాంబరాజు, ప్రభాకర్, రాజు, మునీశ్వర్, సంపత్, హరిప్రసాద్, శనిగరపు రేఖ, వీ బాబు, సుధామోహన్, అశోక్, అకినపల్లి రవి, అరుణ, అంబాల బాబు, పోచంపల్లి సదయ్య, బండ శ్రీనివాస్, సందగల్ల రాజు, సమ్మయ్య, గిన్నారపు ప్రవీణ్ కుమార్, బండ తిరుపతి, మాసంగి రాజేందర్, సందగల్ల తిరుపతి, పులి రమేశ్, పోచంపల్లి రవి, బండ రఘుపతి, గిన్నారపు స్వామిదాస్, సందగల్ల సంజీవ్ పాల్గొన్నారు.
ఇల్లందకుంట, అక్టోబర్ 19: మండల కేంద్రంలో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ ఆధ్వర్యంలో ఈటల రాజేందర్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కనుమల్ల గణపతి, పృథ్వీ, అన్వేశ్, తరుణ్, స్వామిదేవా, శ్రీనివాస్, నరేశ్, సమ్మయ్య, దేవేందర్, రామస్వామి, రాకేశ్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
వీణవంక, అక్టోబర్ 19: మండలంలోని చల్లూరు, రెడ్డిపల్లి, వల్భాపూర్ గ్రామాలతో పాటు మండల కేంద్రంలో దళితులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈటల దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. కరీంనగర్-జమ్మికుంట ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ దాసారపు ప్రభాకర్, మాజీ ఎంపీటీసీ, దళిత సంఘం మండల కన్వీనర్ తాండ్ర శంకర్, రెడ్డిపల్లి సర్పంచ్ పోతుల నర్సయ్య, నాయకులు జీడి తిరుపతి, పర్లపెల్లి తిరుపతి, ఉడుత రమేశ్, పులి ప్రకాశ్, అంబాల మధునయ్య, రాజమౌళి, పోతుల సురేశ్, కిరణ్, జీడి వెంకటస్వామి, దాసారపు చందు, రాజు, రాజేశ్, కుమార్, అంబాల రాజయ్య, భానుచందర్, ప్రకాశ్, సమ్మయ్య, మహిళలు దాసారపు శ్రీలత, లక్ష్మి, కోమల, దాసారపు సరోజన, రాజకొమురమ్మ, కనకమ్మ తదితరులు పాల్గొన్నారు.
జమ్మికుంట రూరల్, అక్టోబర్ 19: జమ్మికుంట పట్టణంలోని అంబేద్కర్ కాలనీతో పాటు మండలంలోని మాచనపల్లి, జగ్గయ్యపల్లి, కోరపల్లి, శాయంపేట, నాగంపేట, గండ్రపల్లి, మడిపల్లి గ్రామాల్లో దళిత నాయకులు, ప్రజాప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. మాచనపల్లి గ్రామంలో ఈటల రాజేందర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి కాట్నం పేర్చి నిప్పంటించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు సుజాతాభద్రయ్య, రమారాజయ్య, స్వాతీకృష్ణారెడ్డి, పద్మ, శ్రీలత, మాజీ సర్పంచ్ పర్లపల్లి రమేశ్, ఎంపీటీసీలు రాజేశ్వర్రావు, మర్రి మల్లేశ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షురాలు మమత, నాయకులు పర్లపల్లి నాగరాజు, ఎర్రయ్య, తిరుపతిరెడ్డి, సుమన్, అబ్దుల్లా, యాదగిరి, రాజేశ్, కుమార్ పాల్గొన్నారు.
కమలాపూర్, అక్టోబర్ 19: మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పర్కాల-హుజూరాబాద్ రహదారిపై దళిత సంఘాల నాయకులు గంటపాటు ధర్నా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు పుల్ల శ్రీనివాస్, మాట్ల అయిలయ్య, పుల్ల రాజేశ్, మాట్ల శ్రీధర్, పుల్ల మహేశ్, మాట్ల ప్రవీణ్, పోగుల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.