ఆర్మూర్, మే 18 : ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన వందలాది మంది యువకులు కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు. ఆర్మూర్, నందిపేట్ మండలాలకు చెందిన గోసంగి సంఘం నాయకులు గంధం రాజశేఖర్, నీరగొండ సాయిలు, మిరియాల వినోద్కుమార్, చిరంజీవి, పత్రి గంగాధర్, కర్రె గంగాధర్, సంతోష్, మిరియాల నర్సయ్య, మిరియాల తిరుపతి, గంధం రాజారాం తదితరులు హైదరాబాద్లో బుధవారం టీఆర్ఎస్లో చేరగా.. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవన్రెడ్డి మాట్లాడుతూ.. దేశ ప్రజల చూపు సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న పథకాలపై ఉందన్నారు. దళితులు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రారంభించారన్నారు. రైతుబంధు పథకం ద్వారా అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో ఇప్పటివరకు రూ.50 వేల కోట్లు జమ చేశారని తెలిపారు. ఇక్కడి అద్భుతమైన పథకాలను మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లో అమలుచేయాలని అక్కడి ప్రజలు ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. కార్యక్రమంలో గోసంగి సంఘం జిల్లా అధ్యక్షుడు బుచ్చన్న, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.