మద్నూర్, మే 17: మండలకేంద్రంలో లక్ష్మీనారాయణ స్వామి రథోత్సవం మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రథాన్ని అందంగా అలంకరించి పాతబస్టాండ్ హనుమాన్ మందిరం వరకు భక్తులు తాళ్లతో లాగుతూ ఊరేగించారు. వేడుకల సందర్భంగా నిర్వహించిన కుస్తీ పోటీలు ఆకట్టుకున్నాయి. పరిసర గ్రామాలతోపాటు మహారాష్ట్ర నుంచి మల్లయోధులు తరలివచ్చి పోటీల్లో పాల్గొన్నారు.
వేడులకలకు హాజరైన ఎమ్మెల్యే షిండే
లక్ష్మీనారాయణ స్వామి ఆలయ వేడుకలకు ఎమ్మెల్యే షిండే హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుస్తీ పోటీలను ఆసక్తిగా తిలకించారు. మండలంలోని అంతాపూర్ గ్రామానికి చెందిన గంగాధర్ ప్రథమ స్థానంలో నిలువగా, ఎమ్మెల్యే చేతులమీదుగా రూ. 5100 నగదు బహుమతిని అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే షిండేను ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగమేశ్వర్, సర్పంచ్ దరాస్ సురేశ్, ఉపసర్పంచ్ విఠల్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గోపాల్, నిర్వహకులు డాక్టర్ విజయ్కుమార్, అనిల్పటేల్, హన్మాండ్లుస్వామి, విజయ్, నాగేశ్, హన్మాండ్లు, నాగనాథ్, సంజయ్, తుకారం, శంకర్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.