కామారెడ్డి రూరల్/ భిక్కనూరు, మే 14 : ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ తిర్మల్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని గాంధీ గంజ్తోపాటు భిక్కనూరు, అంతంపల్లి గ్రా మాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు చేసేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నా రు. రైతులు ధాన్యాన్ని విక్రయించిన తర్వాత వీలైనంత త్వరగా వారి బ్యాంకు ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ అయ్యేలా చూడాలని కేంద్రం నిర్వాహకులకు సూచించారు. అనంతరం గాంధీగంజ్లో మార్కెట్ కమిటీ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తున్న వ్యవసాయ యంత్రాలను అర్హులైన రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పంట మార్పిడి విధానం అవలంబించాలని, వాణిజ్య పంటలవైపు రైతులు దృష్టి సారించాలన్నారు. అనంతరం మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో తిర్మల్రెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గ్యార లక్ష్మీసాయిలు, వైస్ చైర్మన్ కుంబాల రవియాదవ్, ఇన్చార్జి ఆర్డీవో శ్రీనివాస్, జిల్లా మార్కెటింగ్ అధికారిణి రమ్య, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
భిక్కనూరులో ఆయన వెంట ఆర్డీవో శ్రీనివాస్, డీఎస్వో రాజశేఖర్, డీఎం జితేందర్, డీసీవో వసంత, తహసీల్దార్ నర్సింహులు, డీటీ కిష్టయ్య, భిక్కనూర్, అంతంపల్లి విండో చైర్మన్లు భూమయ్య, వెంకట్రెడ్డి, సర్పంచ్ మధుమోహన్ రెడ్డి, వైస్ చైర్మన్లు ముచ్చర్ల రాజిరెడ్డి, అంతంపల్లి వైస్చైర్మన్ రాజిరెడ్డి ఉన్నారు.