కామారెడ్డి, ఏప్రిల్ 19 : రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల పండుగలకు సమప్రాధాన్యం ఇస్తున్నది. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు చీ రెలు, క్రిస్మస్, రంజాన్ సందర్భంగా గిఫ్ట్ ప్యాకులు అందజేస్తూ గౌరవిస్తున్నది. కాగా ఈ నెలలో రంజా న్ మాసం ప్రారంభం కాగా, ముస్లిములకు గిఫ్ట్ ప్యాకుల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే కామారెడ్డి జిల్లాకు రంజాన్ గిప్ట్ ప్యాకులు చేరాయి. త్వరలోనే మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు. మసీదు కమిటీల ఆధ్వర్యంలో అర్హులైన వారిని జాబితాను సిద్ధం చేశారు. కలెక్టర్ ఆమోదముద్ర వేయగానే నియోజక వర్గాలు, మండలాల వారీగా పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాకు 9వేల రంజాన్ పండుగ గిఫ్ట్ ప్యాకులు వచ్చాయి.
గిఫ్ట్ ప్యాకుల పంపిణీకి చర్యలు
2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ సర్కార్ అన్ని మతాలు, కులాల వారికి ప్రాధాన్యత ఇస్తున్నది. వివిధ మతాల్లో ఉన్న పేదలకు పండుగల సమయంలో సర్కార్ గిఫ్టులను పంపి మరింత చేరువైంది. ఆడబిడ్డలు సంబురంగా జరుపుకొనే బ తుకమ్మ పండగకు చీరెలు, క్రిస్మస్, రంజాన్ పం డుగలకు నిరుపేద క్రైస్తవ, ముస్లిములకు ప్రభు త్వం కానుకలు అందిస్తున్నది. కామారెడ్డి జిల్లాకు 9వేల గిఫ్ట్ ప్యాకులు వచ్చాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల వారీగా తోఫాలు సిద్ధంగా ఉన్నాయి. వీటిని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో తహసీల్ కార్యాలయా ల్లో అందుబాటులో ఉంచారు. వీటిని త్వరలోనే రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జాజాల సురేందర్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారుల చేతుల మీదుగా నియోజకవర్గ కేంద్రాల్లో ఆ తర్వాత మండల కేంద్రాల్లో పం పిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
అర్హులైన నిరుపేద ముస్లిములకు గిఫ్ట్ ప్యాకులు అందేవిధంగా పర్యవేక్షణ కోసం తహసీల్దార్లను ప్రత్యేక అధికారులుగా నియమించారు. ఇప్పటికే స్థానికంగా మసీద్ కమిటీలు అర్హులను గుర్తించి జాబితాను రూపొందించి తహసీల్దార్లకు అందజేశారు. తుది జాబితాను కలెక్టర్ జితేశ్ వీ పా టిల్ ఆమోద ముద్ర కోసం పంపారు. జిల్లా కేంద్రంతో పాటు ని యోజకవర్గాల్లో, ఆ తర్వాత మండల కేంద్రాల్లో గిఫ్ట్ ప్యాకులు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కామారెడ్డి నియోజకవర్గానికి 2,500, ఎల్లారెడ్డికి 1,500, బాన్సువాడకు 2,500, జుక్కల్ నియోజక వర్గానికి 2,500 గిఫ్ట్ ప్యాకులు విడుదలయ్యాయి. వీటిని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ కేంద్రాలకు ఇప్పటికే తరలించారు. గ్రామాల వారీగా మసీదు కమిటీల సహకారంతో గిఫ్ట్ ప్యాకుల పంపిణీకి చర్యలు చేపడుతున్నారు. ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీ, రైతు బంధు సమితి కన్వీనర్, పీఏసీఎస్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో గిఫ్ట్ ప్యాకులు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధంగా చేశారు.
పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు
కామారెడ్డి జిల్లాకు 9వేల రంజాన్ కానుకులు వచ్చాయి. వీటికి సంబంధించి అర్హుల జాబితాను రూపొందించా. ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆమోదం రాగానే పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా కానుకలను అందజేస్తాం.
– దయానంద్, మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా ఇన్చార్జి అధికారి, కామారెడ్డి