నిజామాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దాదాపుగా ఏడాదిన్నర కాలంలో కరోనా వైరస్ రెండు సార్లు ఉధృతంగా వ్యాపించి సమాజాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఫస్ట్ వేవ్తో పోలిస్తే సెకండ్ వేవ్ ఉధృతి బలంగా వ్యాపించింది. నూతన వేరియంట్లతో కరోనా పంజా విసరడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది దవాఖానల పాలయ్యారు. కరోనా బారినపడిన వారికి దవాఖానల్లో బెడ్లు కూడా దొరకని దుస్థితి ఏర్ప డింది. రానున్న కాలంలో థర్డ్ వేవ్ ముప్పు ఉందని విశ్లేష ణలు వినిపిస్తున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక వసతుల కల్పనకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితోపాటు ఆయన స్నేహితులు నడుంబిగించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సుమారు రూ.కోటిన్నర నిధులతో బాల్కొండ నియోజక వర్గం, ఆర్మూర్ ఏరియా దవాఖాన, జీజీహెచ్లలో వసతు లు కల్పించనున్నట్లు మంత్రి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు అవసరమైన సౌకర్యాలను సీఎస్ఆర్ కింద వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆయన చెప్పారు.
బాల్కొండలో 102 ఆక్సిజన్ బెడ్లు
బాల్కొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్థానిక ప్రజల మేలు కోసం ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ బెడ్ల్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తన స్నేహితులతో కలిసి చేపట్టబోతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా బాల్కొండలోని అన్ని మండలాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో మొత్తం 102 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బాల్కొండ, మోర్తాడ్ రెండు ఏరియా దవాఖానల్ల్లో వేర్వేరుగా ఐదేసి చొప్పున ఐసీయూ బెడ్లు సైతం ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వానికి సంబంధం లేకుండా పూర్తి ఖర్చును మంత్రితోపాటు ఆయన మిత్రులు భరించనున్నారు. ఆర్మూర్ ఏరియా దవాఖానలోనూ 10 ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేయనున్నా రు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో పిల్లల కోసం ప్రత్యేకంగా పీడియాట్రిక్ వెంటిలేటర్ తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీని ఖరీదు రూ.8లక్షలు వరకు ఉంటుందని వైద్యులు అంచనా వేశారు. థర్డ్వేవ్ ముప్పు పిల్లలపై పడుతుందనే అంచనాల నేపథ్యంలో పీడియాట్రిక్ వెంటిలేటర్ అవసరాన్ని మంత్రికి వైద్యులు వివరించారు. వెంటిలేటర్ కొనుగోలు చేయాలని మంత్రి నిర్ణయం తీసుకున్నారు.
కొవిడ్ అంతానికే ప్రయత్నం..
కొవిడ్ బారినపడిన వారికి చికిత్స అందించేందుకు ఆక్సిజన్ బెడ్లు ఎక్కువగా అవసరం. బాల్కొండ నుంచి నిజామాబాద్, ఆర్మూర్ ఏరియా దవాఖానలకు బాధితులను మొన్నటి వరకు పంపించాం. జీజీహెచ్ లోనే ఆక్సిజన్ బెడ్ల సంఖ్యను 237 నుంచి 537కు పెంచా ము. ఆర్మూ ర్లో హుటాహుటిన వంద ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేశాం. బోధన్లో 14 ఆక్సిజ న్ బెడ్లుంటే 50కి పెంచాం. అయినా సరే సరిపోవడం లేదు. నేను మా మిత్రులతో చర్చిస్తే కొంత మంది సాయం చేయడానికి మానవత్వంతో ముందుకు వచ్చారు. వారి సహకారంతో బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని బెడ్లను ఆక్సిజన్ బెడ్లుగా ఏర్పాటు చేస్తాం. వారం రోజుల నుం చి కలెక్టర్, డీఎంహెచ్వోల తో కలిసి ప్రణాళిక రూపొందించి నిర్ణయానికి వచ్చాం. కొవిడ్ తీవ్రత ఎలా ఉంటుందో తెలియదు. ఇంతటితోనే కరోనా మహమ్మారి నుంచి ముప్పు ముగియాలని కోరుకుంటు న్నాం. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే తాపత్రయంతో ఉన్నాం.
దవాఖానల పరిశీలన
కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు తన స్నేహితుల సహకారం, తన సొంత డబ్బులతో ప్రభుత్వ దవాఖానల్లో ఐసీయూ, ఆక్సిజన్ బెడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. మోర్తాడ్ సీహెచ్సీతోపాటు బాల్కొండ, వేల్పూర్ పీహెచ్సీలను మంత్రి బుధవారం సందర్శించారు. ఆక్సిజన్ బెడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. సౌకర్యాలను మరింత మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మోర్తాడ్ ప్రభుత్వ దవాఖానలో ఐదు ఐసీయూ, 15 ఆక్సిజన్ బెడ్లతోపాటు, వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్నారు. బాల్కొండలో ఆక్సిజన్ బెడ్లు, వేల్పూర్లో ఐసీయూ, ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
కరోనా థర్డ్వేవ్ రావొద్దని కోరుకుంటున్నానని అన్నారు. థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో ఐసీయూ, ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల వారు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేయిస్తున్నామన్నారు. మోర్తాడ్ ప్రభుత్వ దవాఖానలోని ఆపరేషన్, ల్యాబ్, డాక్టర్ల గదులు, బెడ్ల ఏర్పాటు గదులను పరిశీలించిన మంత్రి, ప్రజలకు వైద్యసేవలు అందించే విషయంలో సిద్ధంగా ఉండాలని సూచించారు. మోర్తాడ్ సీహెచ్సీలో మార్చురీ గదిని ఏర్పాటు చేయించాలని ఎంపీపీ శివలింగుశ్రీనివాస్ మంత్రిని కోరడంతో ఎన్నోఏండ్లుగా మార్చురీ ఏర్పాటు చేయాలని కోరుతున్నారని, దాన్ని ఏర్పాటు చేయించాలని అధికారులకు సూచించారు. మంత్రి వెంట జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, డిప్యూటీ డీఎంహెచ్వో రమేశ్, ఆర్డీవో శ్రీనివాసులు, ఏసీపీ రఘు, మోర్తాడ్ జడ్పీటీసీ బద్దం రవి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఏలియా, వైస్ ఎంపీపీ తొగటి శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ కల్లెం అశోక్, వైస్చైర్మన్ దడివె నవీన్, డీసీసీబీ డైరెక్టర్ మోతుక భూమన్న, సర్పంచ్ బోగ ధరణి ఆనంద్, ఎంపీటీసీ రాజ్పాల్, ఉపసర్పంచ్ గంగారెడ్డి, సత్యనారాయణ, ఇంతియాజ్, చిన్నరాజేశ్వర్, జేసీ గంగారెడ్డి, శాస్త్రీ, మురళీగౌడ్, సుమన్, ఆరీఫ్, సతీశ్, వేల్పూర్ ఎంపీపీ భీమ జమున, డాక్టర్ అశోక్, తహసీల్దార్ సతీశ్రెడ్డి, సర్పంచ్ తీగల రాధ, ఉపసర్పంచ్ పిట్ల సత్యం, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు తౌటు గంగాధర్, లింగాగౌడ్, పుప్పల విద్యాసాగర్, సాగర్ యాదవ్ ఉన్నారు.