బాన్సువాడ, జూన్ 22: బాన్సువాడ పట్టణం పరిశుభ్రంగా కనిపించాలని మున్సిపల్ అధికారులను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. మున్సి పాలిటీ పరిధిలో పన్ను వసూళ్లను వేగవంతం చేయా లన్నారు. పట్టణంలో మంగళవారం ఆయన వివిధ కార్యక్రమాల్లోపాల్గొనారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు స్పీకర్ను కలిసి తమ సమస్యలను వివరించారు. రెండు నెలలుగా వేతనాలు అందడం లేదని స్పీకర్కు తెలుపగా, పన్ను వసూళ్లను వేగవంతం చేసి అభివృద్ధి పనులతోపాటు వేతనాలు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలో పారిశుద్ధ్య పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పని చేయని కార్మికులను వెంటనే తొలగించి కొత్తవారిని నియమించాలన్నారు. తాను పట్టణంలో మరోసారి పర్యటించినప్పుడు శుభ్రంగా కనిపించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. బాధ్యతతో పని చేయాలని కార్మికులకు సూచిం చారు. పట్టణంలోని అన్ని వాటర్ ట్యాంకులకు సింగూరు నీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.
సర్గయాత్ర రథం ప్రారంభం..
పట్టణంలోని ఓ మెడికల్ షాపు యజమాని కంకణాల ఆరవింద్ సహకారంతో ఏర్పాటు చేసిన స్వర్గయాత్ర రథాన్ని స్పీకర్ పోచారం అయ్యప్ప ఆలయం వద్ద ప్రారంభించారు. పట్టణ ప్రజల సౌకర్యార్థం స్వర్గరథాన్ని ఏర్పాటు చేసిన అరవింద్ కుటుంబ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సాయిబాబా, నాగులగామ మురళి, రుద్రంగి గంగాధర్, ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ, రాము, డాక్టర్ ప్రకాశ్ పాల్గొన్నారు.
అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు
పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో స్పీకర్ పోచారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులతో మాట్లాడి భక్తులకు టాయ్లెట్స్ సౌకర్యం కల్పించేందుకు రూ.15 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. స్పీకర్ వెంట ఆలయ కమిటీ అధ్యక్షుడు రాజు, కృష్ణారెడ్డి, విఠల్రెడ్డి, మల్లికార్జున్, శంకర్ గురుస్వామి, సోను పంతులు, చంద్రశేఖర్, దత్తు పంతులు ఉన్నారు.
కల్కి చెరువు మరమ్మతు పనుల పరిశీలన..
బాన్సువాడ కల్కి చెరువు కట్ట మరమ్మతు పనులను స్పీకర్ పోచారం పరిశీలించారు. పనులు వేగంగా కొనసాగడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట నీటిపారుదల శాఖ డీఈ శ్రావణ్కుమార్రెడ్డి, ఏఈ గజేందర్, సొసైటీ అధ్యక్షుడు ఏర్వాల కృష్ణారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, గూల సత్యం, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ గంగాధర్, ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ, ముదిరెడ్డి విఠల్రెడ్డి, అబ్బయ్య, లింగం, వడ్ల వెంకటి, రామాచారి తదితరులు ఉన్నారు.