దోమకొండ, జూన్ 22: మండలంలోని సంగమేశ్వర్, సీతారాంపూర్ గ్రామాల్లో నర్సరీలు, కంపోస్ట్షెడ్డుల్లో సేంద్రియ ఎరువుల తయారీ తదితర పల్లెప్రగతి పనులను ఎంపీడీవో చెన్నారెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటేందుకు అవసరమైన మొక్కలను నర్సరీల్లో సిద్ధంగా ఉంచాలన్నారు. పల్లెప్రగతి పనుల్లో నిరక్ష్యం వహించకుండా వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. కంపోస్టు షెడ్లల్లో తయారు చేసిన సేంద్రియ ఎరువులను రైతులకు విక్రయించాలని సుచించారు. ఆయన వెంట ఎంపీవో తిరుపతిరెడ్డి, సర్పంచులు కరికె సుమలతామురళి, ధర్పల్లి స్వరూప, వైస్ ఎంపీపీ బాపురెడ్డి, పంచాయతీ సెక్రటరీ ప్రభుగౌడ్ తదితరులు ఉన్నారు.
మొక్కలను సంరక్షించాలి..
పిట్లం, జూన్ 22: ప్రభుత్వం ఇంటింటికీ పంపిణీ చేస్తున్న మొక్కలను ప్రతి ఒక్కరూ సంరక్షించాలని జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి అన్నారు. కిష్టాపూర్, బుర్నాపూర్ గ్రామాల్లో ఇంటింటా మొక్కల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ కవిత, సర్పంచులు యశోద, ప్రవీణ, విండో చైర్మన్ నారాయణరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు విజయ్, హన్మాండ్లు, లక్ష్మారెడ్డి, దేవయ్య, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
హరితహారం మొక్కల పరిశీలన..
ఎల్లారెడ్డి, జూన్ 22: పట్టణంలో ఏర్పాటు చేసిన నర్సరీలోని మొక్కలను ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీల చైర్మన్లు కుడుముల సత్యం, గంగాధర్ మంగళవారం పరిశీలించారు. ఏపుగా పెరుగుతున్న మొక్కలకు ప్రతి రోజూ నీరు పెట్టాలని, సంరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. వారి వెంట కమిషనర్ జీవన్, నాయకుడు రామప్ప తదితరులు ఉన్నారు.
హండేకేలూర్లో..
మద్నూర్, జూన్ 22 : మండలంలోని హండేకేలూర్ గ్రామ నర్సరీ, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామాన్ని ఎంపీడీవో శ్రీనివాస్ మంగళవారం పరిశీలించారు. నర్సరీలో మొక్కలను సంరక్షించాలని నిర్వాహకులకు సూచించారు. పల్లెప్రకృతి వనం ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం పంచాయతీ రికార్డులను పరిశీలించారు. పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని కార్యదర్శికి సూచించారు.