కోటగిరి, జూన్ 2: కరోనా బాధితుల ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సేవలందించాలని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేం దర్రెడ్డి అన్నారు. కోటగిరి మండలంలోని ఎక్లాస్పూర్ క్యాంపు దిబ్బకు చెందిన ఎన్నారై గుమ్మడి శ్రీధర్ పంపిన రెండు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ప్రభుత్వ దవాఖానకు పోచారం సురేందర్రెడ్డి బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన గుమ్మడి శ్రీధర్ను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. సెకండ్వేవ్లో చాలా మంది ప్రాణాలను తీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలందరూ అవసరమైతేనే బయటికి రావాలని అన్నారు. విపత్కర సమయంలో కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనా బాధితులకు సేవలందిస్తున్న ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, పోలీసు సిబ్బంది ని అభినందించారు. ఆర్డీవో రాజేశ్వర్, జడ్పీటీసీ శంకర్పటేల్, ఏఎంసీ చైర్మన్ నీరడి గంగాధర్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కిశోర్ బాబు, మండల కన్వీనర్ ఎజాజ్ఖాన్, వైస్ ఎంపీపీ మర్కెల్ గంగాధర్ పటేల్, సర్పంచ్ పత్తి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.