లింగంపేట, మార్చి 28: గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడంతో రహదారులు కళకళలాడుతున్నాయి. మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాలకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.60లక్షల నిధులు మంజూరయ్యాయి. మండలానికి మంజూరైన నిధుల్లో ప్రతి ఎంపీటీసీకి రూ.ఐదు లక్షల చొప్పున కేటాయించారు. లింగంపేట పంచాయతీ పరిధిలో రూ.50 లక్షలతో సీసీ రోడ్లతో పాటు మురికి కాల్వలను నిర్మిస్తున్నట్లు సర్పంచ్ లావణ్య తెలిపారు. మురికి కాల్వలు, సీసీ రోడ్ల నిర్మాణంతో పారిశుద్ధ్య సమస్య పరిష్కారం అవుతుందని, వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బందులు తొలిగిపోతాయని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో కొన్ని వార్డుల్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టగా.. మిగిలిన వార్డుల్లో ప్రస్తుతం పనులు కొనసాగుతు న్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో అభివృద్ధి పనులకు నిధులను పుష్కలంగా విడుదల చేస్తుండడంతో పనులు జోరుగా సాగుతున్నాయి.
ఇవీ కూడా చదవండి..
దక్షిణాది వెలుగుల గని సింగరేణి