విద్యానగర్, మార్చి 28 : ఇంటి పన్నును సకాలంలో చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ దేవేందర్ అన్నారు. ఆస్తి పన్ను బకాయిల వడ్డీపై ప్రభుత్వం 90 శాతం రాయితీ ప్రకటించడంతో పట్టణానికి చెందిన పలువురు ఇంటి యజమానులు ఆదివారం ఆస్తి పన్ను కట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. 90 శాతం వడ్డీ మాఫీ ఈనెల 31వ తేదీతో ముగుస్తుందని, ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పన్నులను సకాలంలో కట్టి పట్టణాభివృద్ధికి సహకరించాలని అన్నారు. ఇప్పటి వరకు పట్టణంలో రూ.ఏడు కోట్ల 70లక్షలు వసూలు అయ్యాయని, ఇంకా 50 లక్షల వరకు వసూలు కావాల్సి ఉందని తెలిపారు. వందశాతం పన్ను వసూలు చేసే విధంగా కృషి చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్ఐ జానయ్య, ఆర్వో సతీశ్, బిల్ కలెక్టర్లు సాయిలు, నవీన్, తిరుపతి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి..
సీఎస్ సోమేశ్కుమార్తో ఈస్తోనియా అంబాసిడర్ భేటీ
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై కేంద్రం యూటర్న్