ఎల్లారెడ్డి/నాగిరెడ్డిపేట్/ గాంధారి/రామారెడ్డి/లింగంపేట/ సదాశివనగర్, మార్చి 25: ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ జన్మదిన వేడుకలను నియోజకర్గంలోని వివిధ మండలాలు, గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఎల్లారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ఆధ్వర్యంలో భారీ కేక్ను కట్ చేసి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జలంధర్గౌడ్, జడ్పీటీసీ ఉషాగౌడ్, సొసైటీ అధ్యక్షుడు ఏగుల నర్సింహులు, న్యాయవాది నామ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నాగిరెడ్డిపేట్ మండలంలో ఎల్లారెడ్డి ఏఎంసీ చైర్పర్సన్ బోయిని రాధ, ఏఎంసీ మాజీ చైర్మన్ ప్రతాప్రెడ్డి కేక్ కట్చేశారు. కార్యక్రమంలో తాండూర్ సొసైటీ చైర్మన్ ఆకిడి గంగారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మోతె శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు దివిటి కిష్టయ్య, మాజీ సర్పంచ్ బోయిని విఠల్ పాల్గొన్నారు.
గాంధారి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో టీఆర్ఎస్ నాయకులు కేట్ కట్ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు శంకర్నాయక్, ఎంపీపీ రాధాబలరాం, ఏఎంసీ చైర్మన్ పెద్దబూరి సత్యం, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మమ్మాయి సంజీవ్, విండో చైర్మన్ పెద్దబూరి సాయికుమార్, కాలభైరవస్వామి ఆలయకమిటీ చైర్పర్సన్ మాలతీ సంతోష్, వైస్ ఎంపీపీ భజన్లాల్, మండల కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ ముస్తఫా, ఎంపీటీసీ సభ్యుడు పత్తి శ్రీనివాస్, వీడీసీ చైర్మన్ నాగ్లూర్ మల్లేశ్ పాల్గొన్నారు.
రామారెడ్డి మండలం ఇస్సన్నపల్లి-రామారెడ్డి గ్రామంలో ఉన్న శ్రీకాలభైరవస్వామి ఆలయంలో ఎంపీపీ దశరథ్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వంచ గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కేక్కట్ చేసి వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచులు సంజీవ్, బాలమణి లింబాద్రి, టౌన్ ప్రెసిడెంట్ సుధాకర్, టౌన్ సెక్రటరీ మహిపాల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పడిగెల శ్రీను, కో-ఆప్షన్ సభ్యుడు మహ్మద్ గౌస్ పాల్గొన్నారు.
లింగంపేట టీఆర్ఎస్ కార్యాలయంలో నాయకులు కేక్ను కట్ చేశారు. అనంతరం వృద్ధాశ్రమంలో, పీహెచ్సీలో పండ్లు పంపిణీ చేశారు. సదాశివనగర్లో జడ్పీ కో- ఆప్షన్ సభ్యుడు మోహినుద్దీన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బద్దం శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ రవి, పరమేశ్ గుప్తా, కమలాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.