నిజాంసాగర్/ బాన్సువాడ రూరల్, జూన్ 24 : కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. మండలంలో 27 గ్రామ పంచాయతీలు ఉండగా.. రెండు మూడు రోజుల నుంచి గ్రామాల రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమంతోపాటు అటవీ ప్రాంతాల్లో, ప్రభుత్వ స్థలాల్లో ఉపాధి హామీ కూలీలతో సర్పంచులు మొక్కలు నాటిస్తున్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో సర్పంచులు గురువారం ఇంటింటికీ పూలు, పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. సుల్తాన్నగర్ గ్రామంలో సర్పంచ్ అమీనాబీ, బుర్గుల్ గ్రామంలో సర్పంచ్ సవేరాబేగం, మల్లూర్ తండాలో శాంతిబాయి ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు.బాన్సువాడ మండలంలోని కాద్లాపూర్ గ్రామంలో సర్పంచ్ భాస్కర్ ఇంటింటికీ మొక్కలను గురువారం పంపిణీ చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతిఒక్కరూ ఇండ్ల ఆవరణల్లో మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. ఇంటింటికీ ఆరు చొప్పున మొక్కలను అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వినోద్, ఉపసర్పంచ్ గౌస్, గ్రామస్తులు పాల్గొన్నారు.