నిజాంసాగర్ మండలంలో నోడల్ అధికారుల నియామకం
కామారెడ్డి టౌన్, సెప్టెంబర్ 23: నిజాంసాగర్ మండలంలో దళిత బంధు పథకం అమలుపై సర్వే చేపట్టడానికి అరవై బృందాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ తెలిపారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిజాంసాగర్ మండలంలో దళిత బంధు పథకం అమలుపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 60 బృందాలకు నోడల్ అధికారులను నియమిస్తామని చెప్పారు. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, బాన్సువాడ ఆర్డీవో రాజాగౌడ్, సీపీవో రాజారాం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.