నాగిరెడ్డిపేట్/ బాన్సువాడ రూరల్ : జిల్లాలోని పలు గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను అధికారులు, ప్రజాప్రతిననిధులు బుధవారం పరిశీలించారు.
నాగిరెడ్డిపేట్ మండలంలోని జాన్కంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన అవెన్యూ ప్లాంటెషన్ను ఎంపీడీవో రఘు పరిశీలించారు. రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కల పెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. మొక్కల చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించాలని పంచాయతీ కార్యదర్శి ప్రదీప్ను ఆదేశించారు. ఆయన వెంట సర్పంచ్ సాయిలు ఉన్నారు. నాగిరెడ్డిపేట్ మండలంలోని వదల్పర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన మంకీఫుడ్కోర్టును ఎంపీవో శ్రీనివాస్ బుధవారం పరిశీలించారు. మంకీఫుడ్కోర్టులో నాటిన మొక్కల వివరాలను ఈసీ మధును అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పల్లె ప్రగతి పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట ఈసీ మధు, సర్పంచ్ ప్రవీణ్ ఉన్నారు.
నర్సరీ పరిశీలన
తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటేందుకు కావాల్సిన మొక్కలను నర్సరీలో సిద్ధం చేయాలని బాన్సువాడ మండలం చిన్నరాంపూర్ సర్పంచ్ ఈశ్వరీ రేఖ అన్నారు. గ్రామంలోని నర్సరీని ఆమె బుధవారం పరిశీలించారు. నర్సరీలో మొక్కల వివరాలను పంచాయతీ కార్యదర్శి సురేశ్ను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో స్థలాలను ఎంపిక చేసి లక్ష్యం మేరకు మొక్కలు నాటాలని సూచించారు. ఆమె వెంట నాయకులు శ్రీనివాస్రెడ్డి, అజీజ్ తదితరులు ఉన్నారు.
పారిశుద్ధ్య పనుల పరిశీలన
బాన్సువాడ, జూన్ 23 : వానకాలంలో మురికి కాలువల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, ఎప్పటికప్పుడు కాలువలను శుభ్రం చేయించాలని మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ మున్సిపల్ కమిషనర్ రమేశ్కు సూచించారు. పట్టణంలో చేపడుతున్న శానిటేషన్ పనులను ఆయన బుధవారం పరిశీలించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట నాయకుడు నార్ల ఉదయ్ తదితరులు ఉన్నారు.