డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి
బాన్సువాడ, సెప్టెంబర్ 22: తనలో ఊపిరి ఉన్నంత వరకు కార్యకర్తలను కడుపులో పెట్టి కాపాడుకుంటానని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నారు. బాన్సువాడలోని ఓ ప్రైవేటు గార్డెన్స్లో బుధవారం ఏర్పాటుచేసిన టీఆర్ఎస్ మండల, పట్టణ కమిటీ కార్యవర్గాల ఎన్నిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాస్కర్రెడ్డి మాట్లాడుతూ.. కొందరు ఇతర పార్టీల నాయకులు గ్రామాల్లోకి వచ్చి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నియోజకవర్గంలో 50వేల మందికి టీఆర్ఎస్ సభ్యత్వం ఉందని తెలిపారు. సీఎం కేసీఆర్ సహకారంతో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నియోజకవర్గాన్ని రూ.ఏడు వేల కోట్ల నిధులతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ దొడ్ల నీరజా వెంకట్రాంరెడ్డి, బల్దియా చైర్మన్ జంగం గంగాధర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, విండో, ఏఎంసీ చైర్మన్లు పిట్ల శ్రీధర్, పాత బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మండల కార్యవర్గం ఇదే..
అధ్యక్షుడిగా మోహన్నాయక్, కార్యదర్శిగా రాజేశ్వర్గౌ డ్, యూత్ అధ్యక్షుడిగా ప్రశాంత్కుమార్, మహిళా విభా గం అధ్యక్షురాలిగా భూనేకర్ జ్యోతి, మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా జలీల్, రైతు విభాగం అధ్యక్షుడిగా గులిపల్లి మొగుల య్య, ఎస్సీ, బీసీ, ఎస్టీ సెల్ అధ్యక్షులుగా సాయిలు, బాల య్య, కె.రమేశ్, సోషల్ మీడియా అధ్యక్షుడిగా పి.శ్రీకాంత్రెడ్డి ఎన్నికయ్యారు.
పట్టణ కార్యవర్గం ఇదే..
అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ, కార్యదర్శిగా లింగమేశ్వర్, యూత్ విభాగం అధ్యక్షుడిగా యూసుఫ్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా గులిపల్లి అనిత, రైతు విభాగం అధ్యక్షుడిగా విఠల్రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ సెల్ అధ్యక్షులుగా బాలకృష్ణ, సాయిలు, రామారావు, సోషల్ మీడియా అధ్యక్షుడిగా ఇలియాస్, కార్మిక విభాగం అధ్యక్షుడిగా మల్లికార్జున్, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా కనుకుంట్ల సాయికృష్ణ, వాణిజ్య విభా గం అధ్యక్షుడిగా తాటి రామకృష్ణ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులను డీసీసీబీ చైర్మన్ అభినందించారు.
విప్ను కలిసిన టీఆర్ఎస్ గ్రామ కమిటీల బాధ్యులు..
దోమకొండ, సెప్టెంబర్ 22: టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గండ్ర మధుసూదన్రావు ఆధ్వర్యంలో మండలంలోని ఆయా గ్రామాల టీఆర్ఎస్ కమిటీల నాయకులు ప్రభుత్వ విప్ గోవర్ధన్ను బుధవారం కామారెడ్డిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ.. నూతన కమిటీల బాధ్యులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. నూతన కమిటీ బాధ్యులకు ఆయన అభినందనలు తెలిపి సన్మానించారు. జడ్పీటీసీ తిర్మల్గౌడ్, ఎంపీపీ సదానంద తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడిగా నర్సింహులు..
మాచారెడ్డి, సెప్టెంబర్ 22: టీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడిగా సాడెం నర్సింహులును నియమించినట్లు పార్టీ మండలాధ్యక్షుడు పగడాల బాల్చంద్రం బుధవారం తెలిపారు. ఉపాధ్యక్షుడిగా బాబు, ప్రధాన కార్యదర్శిగా నర్సాపురం పోచయ్య, సంయుక్త కార్యదర్శిగా ఇల్లందుల రవీందర్, కోశాధికారిగా కోలపురం బాబు, ప్రచార కార్యదర్శిగా నిమ్మల నర్సింహులును నియమితులయ్యారన్నారు.