కామారెడ్డి టౌన్, ఏప్రిల్ 19: రూర్బన్ పథకంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి నరేంద్ర సిన్హా సంబంధిత జిల్లా కలెక్టర్లు, పార్లమెంట్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, మార్కెటింగ్ చైర్మన్లు, రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం మాట్లాడారు. ఈ సందర్భంగా రూర్బన్ పథకం కింద జుక్కల్ క్లస్టర్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర అధికారికి కలెక్టర్ శరత్ వివరిచారు. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో రూర్బన్ పను లు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. రూ. 30 కోట్లతో వివిధ రకాల 363 పనులు చేపట్టగా, అందులో 274 పనులు పూర్తిచేశామని వివరించారు. మిగతా పనులు పురోగతిలో ఉన్నట్లు చెప్పారు. జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ మాట్లాడుతూ.. రూర్బన్ పథకాన్ని జుక్కల్ క్లస్టర్లో పకడ్బందీగా అమలు చేసి దేశంలోనే మూడో స్థానంలో నిలిచినట్లు తెలిపారు. కేంద్ర పథకాలకుతోడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో గ్రామాలు ప్రగతిబాట పట్టాయని చెప్పారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం కొంత వెనుకబడి ఉన్నందున రూర్బన్ పథకం కింద అభివృద్ధి చేయాలని కోరా రు. వీడియో కాన్ఫరెన్స్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు ఇన్చార్జి కలెక్టర్ బి.వెంకట మాధవరావు, డీపీవో సాయన్న, జుక్కల్ ఎంపీపీ యశోదాపాటిల్, మార్కెట్ కమిటీ చైర్మన్లు పాల్గొన్నారు.