నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే16 : జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. పలు పీహెచ్సీల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. మాక్లూర్లో 19 మందికి, కల్లడిలో 14 మందికి పరీక్షలు నిర్వహించగా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని వైద్యులు సంజీవ్రెడ్డి, సిఖిందర్నాయక్ తెలిపారు. ఆర్మూర్లో పది పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యులు నాగరాజు, భాస్కర్రావు, ఆయేషా ఫిర్దోస్ తెలిపారు. ఆర్మూర్ ఏరియా దవాఖానలో 50 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి, పట్టణంలోని హౌసింగ్ బోర్డు ప్రైమరీ హెల్త్ సెంటర్లో 40 మందికిగాను ఐదుగురికి, దేగాం పీహెచ్సీలో 12 మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చిందని హెల్త్ సూపర్వైజర్లు అర్గుల్ సుభాష్, ఆనవాల, చంద్రశేఖర్, అనురాధ, ఆరోగ్య కార్యకర్త జక్కుల మోహన్ తెలిపారు. నందిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 21 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒక్కరికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి అజయ్ తెలిపారు.
బోధన్ మండలంలోని సాలూరా పీహెచ్సీ పరిధిలో 28 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్ వచ్చిందని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రేఖ తెలిపారు. ఎడపల్లి పీహెచ్సీలో 25 మందికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్గా తేలిందని వైద్య సిబ్బంది తెలిపారు. రెంజల్ పీహెచ్సీ, కందకుర్తి చెక్ పోస్టుల వద్ద ఆదివారం 43 మందికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు మండల వైద్యాధికారిణి క్రిస్టినా తెలిపారు. కోటగిరి మండలంలోని పొతంగల్ పీహెచ్సీలో 25 మందికి పరీక్షలు చేయగా ఒకరికి, కోటగిరి సీహెచ్సీలో 20 మందిని పరీక్షించగా ఒకరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని డాక్టర్ సమత తెలిపారు.
మోపాల్లో 20 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఒకరికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని పీహెచ్సీ వైద్యుడు నవీన్, జక్రాన్పల్లి పీహెచ్సీలో 15 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందరికీ నెగెటివ్ వచ్చిందని మండల వైద్యాధికారి రవీందర్ తెలిపారు. మోస్రా పీహెచ్సీలో 16 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఇద్దరికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని వైద్యాధికారి మధుసూదన్, ధర్పల్లిలో 14 మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని వైద్యాధికారి రఘువీర్ తెలిపారు. భీమ్గల్ పీహెచ్సీలో 40 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 14 మందికి పాజిటివ్ వచ్చినట్ల్లు వైద్యుడు అజయ్పవార్ తెలిపారు. మోర్తాడ్ సీహెచ్సీలో ఆదివారం 20 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్ష లు నిర్వహించగా నలుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని డాక్టర్ సుమంత్, చౌట్పల్లి పీహెచ్సీలో ఇద్దరికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని డాక్టర్ రతన్సింగ్ తెలిపారు.