బాన్సువాడ, మార్చి 16 : పట్టణ పరిశుభ్రత అందరి బాధ్యత అని, స్వచ్ఛ బాన్సువాడగా తీర్చిదిద్దడంలో పట్టణ ప్రజలు భాగస్వామ్యం కావాలని మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో 2, 16, 18వ వార్డుల మహిళలతో మంగళవారం సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా బుట్టల్లో వేసుకొని ప్రతిరోజూ పారిశుద్ధ్య సిబ్బందికి అందజేయాలని సూచించారు. చెత్తను రోడ్లపై, ఆరుబయట, మురికి కాల్వల్లో పడేస్తే పరిసరాలు అపరిశుభ్రంగా మారి వ్యాధులు ప్రబలుతాయని అవగాహన కల్పించారు. అనంతరం పట్టణ పరిశుభ్రతపై మహిళలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేశ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అంజిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, మహ్మద్ ఎజాస్, కౌన్సిలర్లు మోతీలాల్, బిట్ల రేణుక, మెప్మా అధికారులు రవిశంకర్, నార్ల ఉదయ్ గుప్తా, ఆర్పీలు వనజ, నసీమా, మల్లేశ్వరి, ఇందిర, సునీత తదితరులు పాల్గొన్నారు.