కామారెడ్డి, సెప్టెంబర్ 14: కామారెడ్డి నియోజకవర్గంలోని 99 గ్రామాలకు గాను 99 గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 49 వార్డులకు కమిటీలను పూర్తిచేశారు. దీంతో ఈ నెల 16వ తేదీన కామారెడ్డి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ నియోజకవవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్లో ఏర్పాటుచేయగా.. సంస్థాగత ఎన్నికల ఇన్చార్జిలు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు హాజరుకానున్నారు. సమావేశంలో మండల కమిటీలతోపాటు అనుబంధ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, సదాశివనగర్, రామారెడ్డి, లింగంపేట, గాంధారి, రాజంపేట, తాడ్వాయి కమిటీల ఏర్పాటుపై ఎమ్మెల్యే జాజాల సురేందర్ దృష్టి సారించారు. నియోజకవర్గంలో 207 గ్రామ కమిటీలకు 152 గ్రామ కమిటీలను పూర్తిచేశారు. రామారెడ్డి మండలంలో 19 గ్రామాలకు 18 గ్రామాల్లో కమిటీలను ఏర్పాటు చేశారు. సదాశివనగర్ మండలంలో 80శాతం కమిటీ ఎంపిక పూర్తయ్యింది.బాన్సువాడ నియోజకవర్గంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి, జుక్కల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే షిండే ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు.