బాన్సువాడ / ఎల్లారెడ్డి రూరల్/మద్నూర్/పిట్లం, మే 14 : బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మ బసవేశ్వర జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో బసవేశ్వరుని చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అయ్యప్ప ఆలయ కమిటీ అధ్యక్షుడు మామిండ్ల రాజు మాట్లాడుతూ.. బసవేశ్వరుడు గత ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే కుల,వర్ణ, లింగ బేధాలు లేవని, అందరం సమానమేనని చాటిచెప్పారని అన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు అశోక్ రావు, గురుస్వాములు, వీరశైవ లింగాయత్ సభ్యులు మల్లికార్జున్, మహాదేవి, వీరప్ప, రవీంద్ర ఆర్యతోపాటు కొత్త నారాయణ దంపతులు, దాసరి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి పట్టణంలోని నీలకంఠేశ్వరాలయంలో బసవేశ్వరుని 888వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ఆయన చిత్రపటానికి లింగాయత్ సమాజ్ సభ్యులు పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. లింగాయత్ సమాజ్ సభ్యుడు జంగం నీలకంఠం అప్ప మాట్లాడుతూ.. కొవిడ్ నిబంధనల ప్రకారం బసవేశ్వర జయంతిని నిర్వహించినట్లు చెప్పారు. బసవ జయంతిని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి లింగాయత్ సమాజ్ సభ్యులు ముత్తి వీరప్ప, జంగం సంగప్ప, అశోక్, నాయికోటి రవీందర్, రాధిక రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మద్నూర్ మండలంలోని పెద్దటాక్లి, లింబూర్, మహధన్ హిప్పర్గ, పెద్దఎక్లారా తదితర గ్రామాల్లో బసవేశ్వర జయంతిని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతిని నిర్వహించారు. మండలంలోని లింబూర్ గ్రామంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగమేశ్వర్ పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ రామ్పటేల్, సొసైఈ చైర్మన్ శ్రీనుపటేల్, నాయకులు అశోక్పటేల్, బాబుపటేల్, రాజుదేశాయి, పండిత్రావు, పటేల్ విలాస్, రాజుపటేల్ పాల్గొన్నారు.పిట్లం మండలకేంద్రంలోని తహసీల్ కార్యాలయం వద్ద బసవేశ్వర జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రామ్మోహన్రావు మాట్లాడుతూ.. వీరశైవ లింగాయత్ ఆరాధ్యదైవం బసవేశ్వర స్వామి అన్నారు. కార్యక్రమంలో వీరశైవ సంఘం మండల ప్రధానకార్యదర్శి గురునాథ్, సభ్యులు ధర్మవీర్, ప్రమోద్ పటేల్, నరేశ్, సంగప్ప తదితరులు పాల్గొన్నారు.