నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 14: జిల్లాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబా సాహెబ్ విగ్రహాలు, చిత్రపటాలకు ప్రజాప్రతినిధులు, అధికారులు, దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కేంద్రంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం, దళిత కళ్యాణ్, టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో, టీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రెండో డిపోలో, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో, మాల మహానాడు, సీపీఐ(ఎం), పోలీసు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా బీసీ సంక్షేమ సంఘం, బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, మేయర్ నీతూకిరణ్, తెలంగాణ జాగృతి నాయకులు, రంగు నవీన్ ఆచారి, అవంతి రావు, నరాల సుధాకర్ తదితరులు రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
జిల్లా ప్రజలకు జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు బుధవారం ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. డిచ్పల్లిలోని రాష్ట్ర ప్రత్యేక పోలీసు 7వ బెటాలియన్లో కమాండెంట్ ఎన్వీ సత్యశ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీయూ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ప్రధానాచార్యుడు డాక్టర్ వాసం చంద్రశేఖర్ అంబేద్కర్ చిత్రపటానికి అంజలి ఘటించారు. ఘన్పూర్లో సీఐ రఘునాథ్, ఎస్సై ఆంజనేయులు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ముల్లంగి(ఐ)లో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాటిపల్లి నగేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ధర్మారం(బీ) గ్రామంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్, మాల మహానాడు నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు అంబేద్కర్ నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు.
జక్రాన్పల్లి మండలంలో అంబేద్కర్ విగ్రహానికి ఎంపీపీ డీకొండ హరిత, జడ్పీటీసీ తనూజా శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీపీ కుంచాల విమలా రాజుతోపాటు ప్రజా ప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి అంబేద్కర్కు నివాళి అర్పించారు. ధర్పల్లిలో ఎంపీపీ నల్ల సారికా హన్మంత్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హన్మంత్రెడ్డి, ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొన్నారు. మోపాల్లో ఎంపీపీ లతా కన్నేరామ్, ఎంపీడీవో ఇక్బాల్ తదితరులు నివాళులర్పించారు. సిరికొండ మండలం పందిమడుగు గ్రామంలో ఎవరెస్ట్ను అధిరోహించిన మలావత్ పూర్ణ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైస్ ఎంపీపీ తోట రాజన్న, నాయకులు పాల్గొనారు.
బోధన్లో రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి ఆర్డీవో రాజేశ్వర్, మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మావతి, ఏసీపీ రామారావు, పట్టణ సీఐ రమణ్, డీసీసీబీ డైరెక్టర్ గిర్దావర్ గంగారెడ్డి, టీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాధాకృష్ణ, కో- ఆప్షన్ సభ్యుడు సత్యనారాయణ, దళిత సంఘాల నాయకులు, తపస్ నాయకులు కర్నె శంకర్ తదితరులు నివాళులు అర్పించారు. ఎడపల్లి మండలం బాపూనగర్లో అంబేద్కర్ విగ్రహాన్ని జడ్పీ వైస్ చైర్పర్సన్ రజితాయాదవ్, ఎంపీపీ శ్రీనివాస్, బోధన్ ఏఎంసీ చైర్మన్ అర్చనా సూర్యకాంత్ ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుభాష్, నాయకులు పాల్గొన్నారు. బోధన్ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీపీ బుద్దె సావిత్రి, టీఆర్ఎస్ నాయకుడు బుద్దె రాజేశ్వర్, అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
భీమ్గల్లో మున్సిపల్ చైర్పర్సన్ మల్లెల రాజశ్రీ, చేంగల్లో ఎంపీపీ ఆర్మూర్ మహేశ్, కౌన్లిలర్లు, దళిత సంఘాల నాయకులు నివాళులర్పించారు. వేల్పూర్లో దళిత సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. డిప్యూటీ డీఎంహెచ్వో రమేశ్, ఎంపీపీ భీమ జమున, ఎంపీడీవో కరుణాకర్, తహసీల్దార్ సతీశ్రెడ్డి తదితరులు అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాల్లో నిర్వహించిన వేడుకల్లో ఎంపీపీలు శివలింగుశ్రీనివాస్, గౌతమి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కల్లెడ ఏలియా, రేగుంట దేవేందర్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కమ్మర్పల్లిలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకులతోపాటు సావిత్రీబాయి పూలే అవార్డును అందుకున్న విజయ్కుమార్ను సన్మానించారు.
నవీపేట మండలం నందిగామ గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు, రిటైర్డ్ తహసీల్దార్ సక్కి గంగాధర్ ఆవిష్కరించారు. మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో నిజామాబాద్ ఆర్డీవో రవి, తహసీల్దార్ లత, ఎంపీడీవో సయ్యద్ సాజిద్ అలీ తదితరులు పాల్గొన్నారు. జన వికాస సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు తెడ్డు పోశెట్టి ఆధ్వర్యంలో, మండలంలోని అన్ని గ్రామాల్లో జయంతి వేడుకలను నిర్వహించారు. ఆర్మూర్లో మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత, వైస్ చైర్మన్ మున్నాభాయ్, కౌన్సిలర్, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు ఖాందేశ్ సంగీత తదితరులు పాల్గొన్నారు. రుద్రూర్లో ఎంపీపీ అక్కపల్లి సుజాతా నాగేందర్, వైస్ ఎంపీపీ సాయిలు, ఎంపీడీవో బాల గంగాధర్, నాయకులు నివాళులర్పించారు. రెంజల్, మాక్లూర్, నందిపేట్, ఇందల్వాయి, కోటగిరి, మోస్రా, చందూర్, వర్ని, నిజామాబాద్ రూరల్ మండలాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు.