ఇందూరు, ఏప్రిల్ 8: లోక కల్యాణార్థం తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్తక సభ, శాక్తపరిషత్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఉమామహేశ్వరాలయంలో గురువారం చతుర్వేద సదస్సు, అథర్వణ వేద యాగం ప్రారంభించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గురుప్రార్థన, గణపతి పూజ, పుణ్యాహవాచనం, యాగశాల ప్రవే శం, అరణి మథన పూర్వక అథర్వణ వేదయాగ అగ్ని ప్రతిష్ఠ, చతుర్వేద పరీక్షలు, నా మ సంకీర్తన భజనలు కొనసాగాయి. మూడు రోజులపాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి మధుసుదానంద సరస్వతీ స్వామి హాజరయ్యారు. బ్రహ్మశ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ, దెందుకూరి నారాయణ శ్రౌతి, వి ద్వాన్ నంబి వాసుదేవాచార్యులు ప్రవచనాలు చేశారు. కార్యక్రమంలో వేలేటి పశుపతి శర్మ, వేలేటి దుర్గ పరమేశ్వర శర్మ, చెరు కు కృష్ణ ప్రసాద్ శర్మ, పుల్లన్న ప్రవీణ్ శర్మ, శ్రీహరి శర్మ, కిశోర్ శర్మ, రాజవయ్య శర్మ, పురోహితులు, వేదపండితులు పాల్గొన్నారు.
చతుర్వేద పరీక్షలు
ఉదయం నుంచి సాయంత్రం వరకు చతుర్వేద పరీక్షలు నిర్వహించారు. వివిధ పాఠశాలల్లో వేదాలు నేర్చుకున్న విద్యార్థులు వచ్చారు. ప్రతిభను చాటి వేద పరీక్షల్లో నెగ్గిన వారికి గురువులు ధ్రువపత్రాలను చివరిరోజున అందజేయనున్నా రు. పరీక్షా అధికారులుగా పల్లూరు మాణిక్య సోమయాజి, సూర్యనారాయణ ఘనాపాటి, కేదార్నాథ్ ఘనాపాటి, సామవేదం సుందరరామ, వేలేటి సిద్ధ రామేశ్వర వ్యవహరించారు. అనంతరం అథ్వరణ వేద పారాయణం చేయించారు.