నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 7 : కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే రెండో రోజైన శుక్రవారం కొనసాగింది. జిల్లావ్యాప్తంగా వైద్యసిబ్బందితోపాటు అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, వీఆర్ఏలు, పంచాయతీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలను సేకరించారు. కొవిడ్ లక్షణాలు ఉన్న వారికి అక్కడికక్కడే మందులను అందజేశారు. పలు గ్రామాల్లో సర్వేలను ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించారు.
బాన్సువాడ పట్టణంతోపాటు మండలంలోని వివిధ గ్రామాల్లో సర్పంచులు, పంచాయతీ అధికారులు, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు, ప్రజాప్రతినిధులు బృందాలుగా ఏర్పడి కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలన వివరిస్తూ కరోనా పరీక్షలు నిర్వహించారు. పట్టణంలో చేపట్టిన సర్వేను ఆర్డీవో రాజాగౌడ్, మున్సిపల్ కమిషనర్ రమేశ్ పరిశీలించారు.
గ్రామాల్లో సర్పంచులు, ఆరోగ్య సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కొవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే తెలియజేయాలని వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్ అన్నారు. ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ఒకటో వార్డులో వైద్యసిబ్బంది నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను ఆయన పరిశీలించారు. ఆయనతో పాటు మత్తమాల పీహెచ్సీ వైద్య సిబ్బంది ఉన్నారు.గాంధారి మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో వైద్యసిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బంది జ్వర సర్వేను చేపట్టారు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారి వివరాలను నమోదు చేసుకున్నారు. కొవిడ్ లక్షణాలు ఉన్న వారికి మందులను అందజేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
బీర్కూర్ మండలకేంద్రంలో వైద్యాధికారులు, సిబ్బంది సర్వే చేపట్టారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఇంటి నంబరు ఆధారంగా కుటుంబ సభ్యుల వివరాలు, కొవిడ్ లక్షణాలు ఉన్నవారి వివరాలను నమోదు చేసుకున్నామని పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
నస్రుల్లాబాద్ మండలకేంద్రంతో పాటు నెమ్లి, అంకోల్, సంగెం తదితర గ్రామాల్లో ఆరోగ్య, పంచాయతీ సిబ్బంది సర్వే నిర్వహించారు. నెమ్లి గ్రామంలో నిర్వహిస్తున్న సర్వేను తహసీల్దార్ ధన్వాల్ పరిశీలించారు. కార్యాలయంలో ఎంపీపీ విఠల్, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, సర్పంచ్ సాయి లు, నాయకులు ప్రతాప్, వీరారెడ్డి, హన్మాండ్లు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
సర్వేను పకడ్బందీగా చేపట్టాలి
సర్వేను పకడ్బందీగా చేపట్టాలని మండల ప్రత్యేకాధికారిణి భాగ్యలక్ష్మి, ఎంపీడీవో చెన్నారెడ్డి వైద్యసిబ్బందికి సూచించారు. దోమకొండ మండలకేంద్రంలో సర్వేను, పీహెచ్సీ కొవిడ్ టీకా కేంద్రాన్ని వారు పరిశీలించారు. కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి మెడికల్ కిట్లను అందజేయాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రకృతి వనంలో మొక్కలకు నీరుపట్టారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు తిర్మల్గౌడ్, ఎంపీవో తిరుపతి, సూపరింటెండెంట్ సంగీత్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామం లో కొనసాగుతున్న సర్వేను తహసీల్దార్ వేణుగోపాల్, సర్పంచ్ అంజయ్య పరిశీలించారు. రెండు రోజులుగా సుమారు 60 శాతం సర్వే పూర్తయిందని, మరో రెండు రోజుల్లో సర్వే పూర్తిచేస్తామని చెప్పారు. వారి వెంట పంచాయతీ కార్యదర్శి లక్ష్మణ్, అంగన్వాడీ కార్యకర్త శోభ తదితరులు ఉన్నారు.
నాగిరెడ్డిపేట్ మండలవ్యాప్తంగా 7,600 ఇండ్లు ఉండగా శుక్రవారం వరకు 7,400 ఇండ్ల సర్వే పూర్తి చేశామని ఎంపీవో శ్రీనివాస్ తెలిపారు. వదల్పర్తి గ్రామంలో నిర్వహిస్తున్న సర్వేను డిప్యూటీ డీఎంహెచ్వో శోభారాణి, మెడికల్ ఆఫీసర్ నందిత పర్యవేక్షించారు. కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ వరలక్ష్మి, సర్పంచులు, అంగన్వాడీ కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్ఎంలు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.తాడ్వాయి మండలంలోని వివిధ గ్రామాల్లో సర్వే చేపట్టినట్లు మండల వైద్యాధికారి రవీందర్రెడ్డి తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్న వారిని టెస్టు కోసం పీహెచ్సీకి పంపుతున్నామని తెలిపారు. సర్వేకు ఇంటికి వచ్చే అధికారులకు గ్రామస్తులు సహకరించాలని ఆయన కోరారు.
మాచారెడ్డి మండలం పోతారం గ్రామంలో ఆరోగ్య వివరాలతోపాటు కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న వారి వివరాలను వైద్యారోగ్య సిబ్బంది సేకరించారు.కామారెడ్డి పట్టణంలోని 15వ వార్డులో చేపట్టిన సర్వేను అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పరిశీలించారు. అనంతరం వార్డులోని ప్రకృతివనాన్ని పరిశీలించారు. వ్యాధి లక్షణాల తీవ్రతను బట్టి దవాఖానకు తరలించాలని సిబ్బందికి సూచిం చారు. మున్సిపల్ కమిషనర్ దేవేందర్, 47వ వార్డు కౌన్సిలర్ గెరిగంటి స్వప్న లక్ష్మీనారాయణ, 15వ వార్డు కౌన్సిలర్ వనిత రామ్మోహన్, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.