ఆర్మూర్/ కమ్మర్పల్లి, జూన్ 7: టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ను పరామర్శించేందుకు హైదరాబాద్ నుంచి జగిత్యాల జిల్లా మెట్పల్లి మండల రేగుంటకు వెళ్లారు. మార్గమధ్యంలో నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, కమ్మర్పల్లి జాతీయ రహరదారుల వద్ద కేటీఆర్కు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యే జీవన్రెడ్డి స్వాగతం పలికారు. ఆర్మూర్ మండలంలోని కోటార్మూర్ 44, 63వ జాతీయ రహదారుల జంక్షన్ వద్ద మంత్రి కేటీఆర్కు స్థానిక ఎమ్మెల్యే జీవన్రెడ్డితోపాటు టీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికారు. నిజామాబాద్ జిల్లా సరిహద్దు కమ్మర్పల్లిలో కేటీఆర్కు రైతు కండువా కప్పి స్వాగతం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాల్కొండ నియోజక వర్గ నాయకులను మంత్రి వేముల కేటీఆర్కు పరిచయం చేశారు. కేటీఆర్ నాయకులు, కార్యకర్తలను ప్రేమగా పలుకరించారు. అందరూ బాగున్నారా అని క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి వేముల కేటీఆర్తో కలిసి రేగుంటకు వెళ్లారు.