నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్ 4: జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. శుక్రవారం పలు మండలాల్లో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఎక్కువగా నెగెటివ్ రిపోర్టులు వచ్చాయి. భీమ్గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 142 మంకి టెస్టు లు నిర్వహించగా తొమ్మిది మందికి పాజిటివ్ వచ్చిందని ప్రభుత్వ దవాఖాన వైద్యుడు అజయ్పవార్ తెలిపారు. బోధన్ మండలంలోని సాలూరా పీహెచ్సీ పరిధిలో ఉన్న అన్ని సబ్ సెంటర్లో కరోనా పరీక్షలు నిర్వహించామని డాక్టర్ రేఖ తెలిపారు. శుక్రవారం 143 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే అందులో కేవలం ఒక్కరికి మాత్రమే పాజిటివ్ వచ్చిందన్నారు. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానల్లో శుక్రవారం నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారులు తెలిపారు. పట్టణంలోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో 37 మందికి పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి, రాకాసీపేట్ అర్బన్హెల్త్ సెంటర్లో 12 మందికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి, పాన్గల్లీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చిందని వైద్యులు, సిబ్బంది తెలిపారు.
ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 30 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారులు, సిబ్బంది తెలిపారు. కమ్మర్పల్లి పీహెచ్సీలో 52 మందికి టెస్టులు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. చౌట్పల్లి పీహెచ్సీలో 144 మందికి టెస్టులు నిర్వహించగా అందరికి నెగెటివ్ వచ్చింది.
రెంజల్ పీహెచ్సీ, కందకుర్తి చెక్పోస్టు వద్ద 130 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా, వారిలో ఒకరికి పాజిటివ్ వచ్చిందని మండల వైద్యాధికారిణి క్రిస్టినా తెలిపారు. ఆర్మూర్ మున్సిపల్లోని ఏరియా దవాఖాన, పట్టణంలోని హౌసింగ్ బోర్డులో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్లో, మండలంలోని దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల్లో రెండు పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యులు నాగరాజు, భాస్కర్రావు, ఆయేషా ఫిర్దోస్, స్వాతి వినూత్న, అమృత్రాంరెడ్డి, హెల్త్ సూపర్వైజర్లు అర్గుల్ సుభాష్, అనురాధ, చంద్రశేఖర్ తెలిపారు. చేపూర్లో 15 మందికి ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్ వచ్చినట్లు వైద్యసిబ్బంది తెలిపారు. ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం 80 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్ వచ్చినట్లు వైద్యులు పేర్కొన్నారు.
మోపాల్ మండల కేంద్రంలో 123 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ నవీన్ తెలిపారు. కోటగిరి దవాఖానలో 60 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఒకరికి, పొతంగల్ దవాఖానలో 102 మందికి టెస్టులు చేయగా ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యసిబ్బంది తెలిపారు. జక్రాన్పల్లి మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 101 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చిందని మండల వైద్యాధికారి రవీందర్ తెలిపారు. వర్ని మండల కేంద్రంలోని కమ్యూనిటీ వైద్యశాలలో 30 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్ వచ్చినట్లు వైద్యాధికారి వెంకన్న తెలిపారు. మోస్రా మండల కేంద్రంలోని పీహెచ్సీలో 80 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి మధుసూదన్ తెలిపారు.
ఉపాధి హామీ కూలీలకు పరీక్షలు
కోటగిరి, జూన్ 4: మండల కేంద్రం సమీపంలోని నల్ల చెరువు వద్ద ఉపాధి హామీ కూలీలకు కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ కరోనా టెస్టులు చేయించుకోవాని సర్పంచ్ పత్తి లక్ష్మణ్ సూచించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ జ్యోతి, ఏఎన్ఎంలు మంజుల, లలిత, ఆశ కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది వెంకటలక్ష్మి, చిత్తరి సాయిలు పాల్గొన్నారు.