ఎల్లారెడ్డి/బీబీపేట్/గాంధారి/నాగిరెడ్డిపేట్/లింగంపేట/తాడ్వాయి/ కామారెడ్డి, మే 4: ఎల్లారెడ్డి మండలంలో మంగళవారం 22 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో 39 మందికి వ్యాక్సిన్ వేశారు. 52మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా, పది మందికి పాజిటివ్గా తేలింది. మండల కేంద్రంలోని మత్తమాల పీహెచ్సీలో 65 మందికి కొవిడ్ టీకాలు ఇచ్చినట్లు మెడికల్ ఆఫీసర్ వెంకటస్వామి తెలిపారు. 56 మందికి కరోనా పరీక్షలు చేయగా, 12మందికి పాజిటివ్, 44 మందికి నెగెటివ్ వచ్చినట్లు ఆయన తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకోవాలనుకునేవారు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకొని సూచించిన తేదీల్లో దవాఖానలకు వెళ్లి టీకా తీసుకోవాలన్నారు. బీబీపేట్ మండల కేంద్రంలోని పీహెచ్సీలో 39 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ఎనిమిది మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని వైద్యులు తెలిపారు. అదేవిధంగా పీహెచ్సీలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. మంగళవారం 83 మందికి టీకాలు వేశామని హెచ్ఈవో శంకర్ తెలిపారు.
గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానతోపాటు, ఉత్తునూర్ పీహెచ్సీలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని డాక్టర్ హరికృష్ణ తెలిపారు. 43 మందికి పరీక్షలు నిర్వహించగా 19 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు. ఉత్తునూరు పీహెచ్సీలో 45 మందికి, గాంధారిలో 103 మందికి కరోనా టీకాలు వేశామని తెలిపారు. నాగిరెడ్డిపేట్ మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం 53 మందికి పరీక్షలు నిర్వహించగా 20 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్ల్లు వైద్య సిబ్బంది తెలిపారు. మండలంలో 59 మందికి వ్యాక్సిన్ వేశామన్నారు. లింగంపేట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యురాలు సమీనా తెలిపారు.
మంగళవారం 38 మందికి పరీక్షలు నిర్వహించగా 9 పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. రాంపల్లి తండా, కన్నాపూర్లో రెండు, ఒంటర్పల్లి, బోనాల్ తండా, నల్లమడుగు, గాంధారి మండలంలోని వంద్రికల్ గ్రామంలో ఒక్కోక్కటి చొప్పున పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆమె తెలిపారు. తాడ్వాయి మండల పరిధిలోని ఎర్రాపహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 35మందికి పరీక్షలు నిర్వహించగా 11 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి రవీందర్రెడ్డి తెలిపారు. భిక్కనూరు మండలంలో 35 మందికి టెస్టులు చేయగా, ముగ్గురికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి శ్రీనివాస్ తెలిపారు. 119 మందికి కరోనా వాక్సిన్ వేసినట్లు చెప్పారు.
కొవిడ్ వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
పిట్లం, మే 4: మండలంలోని ప్రజలు కొవిడ్ వ్యాక్సిన్ కోసం తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పిట్లం ఆరోగ్యశాఖ వైద్యాధికారి రోహిత్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వ్యాక్సిన్ కోసం కొవిన్ పోర్టల్ లేదా ఆరోగ్యసేతు యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, వారికి కేటాయించిన తేదీ ప్రకారం వ్యాక్సిన్ వేయించుకోవాలని పేర్కొన్నారు.