విద్యానగర్/ ఖలీల్వాడి, మే 1: ఉమ్మడి జిల్లాలో శనివారం 915 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 1227 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 374 పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 27,378 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 541 కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి బాలనరేంద్ర తెలిపారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 29, 522 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.