ఎల్లారెడ్డి రూరల్, ఏప్రిల్ 1 : మండలపరిధిలోని ప్రతి ఆటోకూ డిజిటలైజేషన్ తప్పసరిగా చేయించుకోవాలని ఎల్లారెడ్డి సీఐ రాజశేఖర్ అన్నారు. మండలకేంద్రంలోని ముత్యపు రాఘవులు ఫంక్షన్హాలులో ఆటోడ్రైవర్లతో గురువారం ఏర్పాటు చేసిన ‘ఆటో డిజిటలైజేషన్’ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిలో ఆటో డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఇప్పటికే జిల్లాకేంద్రంలో 1500 ఆటోలు, బాన్సువాడలో 400 ఆటోలకు డిజిటలైజేషన్ చేయించారని తెలిపారు. ఆటోడ్రైవర్లు, ఆటోల్లో ప్రయాణించే వారి సేఫ్టీ కోసం పూర్తిస్థాయిలో ఆటోలను డిజిటలైజేషన్ చేయించుకోవాలని సూచించారు. డిజిటలైజేషన్ చేయించుకోవడం ద్వారా ఆటో యజమానులకు ఇన్సూరెన్స్ వర్తిస్తుందని చెప్పారు. ప్రమాదవశాత్తు ఆటో డ్రైవర్ ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబానికి ఇన్సూరెన్స్ కింద లక్ష రూపాయలు అందజేస్తారని, గాయాలపాలైతే పరిస్థితిని బట్టి చికిత్స కోసం డబ్బులు అందజేస్తారని తెలిపారు.
హైదరాబాద్ వాల్వ్డేటా ప్రైవేట్ లిమిటెడ్ టెక్నికల్ మేనేజర్ నాగార్జున మాట్లాడుతూ.. డిజిటలైజేషన్ చేయించడం ద్వారా మండలంలోని ఆటోల వివరాలన్నీ స్థానిక పోలీస్స్టేషన్లో నమోదై ఉంటాయన్నారు. డిజిటల్ క్యూఆర్ కోడ్లు, హాక్ ఐ, టీఎస్ కాప్ యాప్కు అనుసంధానం చేస్తామని, దీంతో ప్రయాణికులు ఉన్న వాహనం లొకేషన్ షేర్ అవుతుందని వివరించారు. ఆటోకు సంబంధించిన వివరాలన్నీ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్లో నమోదవుతాయని తెలిపారు. వాహనానికి అతికించి ఉన్న క్యూఆర్ కోడ్ను ప్రయాణికులు స్కాన్ చేసుకుంటే అత్యవసర టెక్ట్స్, కాల్స్ ఆప్షన్స్ వస్తాయన్నారు. ఆపదలో ఉన్నప్పుడు వాటిని వినియోగిస్తే డయల్ 100కు సమాచారం చేరుతుందన్నారు. సమావేశంలో ఎల్లారెడ్డి ఎస్సై శ్వేత, నాగిరెడ్డిపేట్ ఎస్సై రాజయ్య, వాల్వ్ డేటా ప్రైవేట్ లిమిటెడ్ ఫీల్డ్ అసిస్టెంట్ సతీశ్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ మండలాల ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండీ..
కోవిడ్ హాట్స్పాట్.. రిషికేశ్లో తాజ్ హోటల్ మూసివేత
వైరల్ వీడియో : షోలే పాటకు ఇరాన్ మహిళ స్టెప్పులు