అపర భగీరథుడు సీఎం కేసీఆర్
జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే
గంగమ్మకు చీర, సారె సమర్పణ
నిజాంసాగర్, ఏప్రిల్ 24: నిజాంసాగర్ ప్రాజెక్టు కాళేశ్వరం నీటితో పూర్వ వైభవం సంతరించుకున్నదని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో ప్రారంభం కావడంతో ఆయన గంగమ్మకు చీర, సారెను శనివారం సమర్పించారు. ఒడిబియ్యం, పూలు సమర్పించి చల్లంగా దీవించు తల్లి అంటూ వేడుకున్నా రు. అనంతరం ఆయన మాట్లాడు తూ.. ప్రధాన నది నీటిని ఉప నదిలోకి తీసుకురావడం కేవలం కేసీఆర్తోనే సాధ్యమైందన్నారు. గోదావరి నీరు నిజాంసాగర్లోకి చేరిన వేళ మరుపురాని ఘట్టం అని అభివర్ణించారు. గోదావరి నీటిని నిజాంసాగర్కు తీసుకొచ్చిన సీఎం కేసీఆర్కు నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్, సీడీసీ చైర్మన్ గంగారెడ్డి, వైస్ ఎంపీపీ మనోహర్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు రమేశ్గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, సొసైటీ చైర్మన్ వాజిద్, నాయకులు రాంచందర్, లక్ష్మారెడ్డి, కాశయ్య, ఇఫ్తేకర్, అప్జల్, ఏఈ శివ తదితరులు ఉన్నారు.
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి కాళేశ్వరం జలాలు చేరడంతో ప్రాజెక్టుకు సమీపంలో ఉన్న అచ్చంపేట గ్రామస్తులు శనివారం ప్రాజెక్టులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితుడు సంజీవ్రావు మంత్రోచ్ఛారణల మధ్య పూజలు చేసిన అనంతరం ప్రాజెక్టులోనే ఉన్న గంగమ్మ ఆలయంలో సైతం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాళేశ్వరం నీటిని నిజాంసాగర్కు తీసుకువచ్చిన సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక యువకులతో పా టు పెద్దలు సైతం కాళేశ్వరం నీరు నిజాంసాగర్కు వచ్చి న ఆనందంతో నీటిలో సందడి చేస్తూ ఆనందంగా గడిపారు. నాయకులు సత్యనారాయణ, రమేశ్, దాచ కిషన్, ప్రవీణ్, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.