నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్ట్లోకి శుక్రవారం సాయంత్రం 66300 క్యూసెక్కుల ఇన్ఫ్లో ప్రవహిస్తున్నట్లు డీఈఈ శ్రావణ్కుమార్ తెలిపారు. సింగూరు ప్రాజెక్టుతో పాటు పోచారం ప్రాజెక్టు నుంచి ఇన్ఫ్లో వస్తుండడంతో 81, 900 క్యూసెక్కుల నీటిని వియర్ నంబర్ 12లో ఏడు వరద గేట్ల ద్వారా, వియర్ నంబర్ 16లో నాలుగు వరద గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
పిట్లం మండలంలోని కుర్తి గ్రామ ప్రజల అవసరాల కోసం మధ్యాహ్నాం నీటి విడుదలను 32,000 వేల క్యూసెక్కులు తగ్గించి ఐదు వరద గేట్ల ద్వారా నీటిని విడుదల కొనసాగిస్తున్నామని రాత్రి నుంచి తిరిగి నీటి విడుదలను పెంచనున్నామని అన్నారు. నిజాంసాగర్ వరద గేట్ల ద్వారా గత 14 రోజులుగా 50 టీఎంసీల నీటిని మంజీరాలోకి విడుదల చేశామని ఆయన పేర్కొన్నారు.