కామారెడ్డి: కామారెడ్డి జిల్లా జుక్కల్లో పెను ప్రమాదం తప్పింది. గురువారం తెల్లవారుజామున జుక్కల్ మండలంలో భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షంతో హంగర్గ వాగులో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది. దీంతో పొలం పనులకు వెళ్లిన తొమ్మిది మంది రైతులు వరదలో చిక్కుకున్నారు. గుర్తించిన స్థానికులు వారిని తాడు సహాయంతో ఒడ్డుకు చేర్చారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.