కామారెడ్డి : ఒంటరిగా నడుచుకుంటున్న వెళ్తున్న మహిళకు ఓ వ్యక్తి లిఫ్ట్ ఇస్తానని నమ్మించి తన బైక్పై తీసుకెళ్లాడు. మార్గమధ్యలో మహిళను బెదిరించిన గుర్తుతెలియని దుండగుడు రెండున్నర తులాల బంగారు గొలుసుతో పరారయ్యాడు. వివరాల్లోకి వెళ్తే..కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామానికి చెందిన వడ్ల లత అనే మహిళ వ్యక్తిగత పనుల నిమిత్తం కామారెడ్డికి బయలుదేరింది.
అదే సమయంలో వర్షం రావడంతో నడుచుకుంటూ వెళ్తున్న లతకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి గుర్తు తెలియని వ్యక్తి బైక్పై ఎక్కించుకున్నాడు. మార్గమధ్యలో బైక్ అపి ఆమెను బెదిరించి రెండున్నర తులాల గొలుసు లాక్కుని పరారయ్యాడు. లత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.