కామారెడ్డి టౌన్ : అటవీ, రెవెన్యూ భూవివాదాలు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. బుధవారం రెవెన్యూ, ఫారెస్టు భూ సమస్యలపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఫారెస్ట్ అధికారులు భూములకు బౌండరీ ఏర్పాటు చేయాలని సూచించారు. ధరణిలో పెండింగ్ లేకుండా చూసుకోవాలని కోరారు. మినీ బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు కోసం బీర్కూర్ , దోమకొండ, నస్రుల్లాబాద్లో ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని పేర్కొన్నారు.
బృహత్ పల్లె ప్రకృతి వనాల చుట్టూ గ్రీన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, డీఎఫ్వో నిఖిత, ఆర్డీవో రాజాగౌడ్ , ఏవో రవీందర్ , తాసీల్దార్లు పాల్గొన్నారు. అనంతరం ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. 42 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను పూర్తిచేయాలని , పరీక్షల్లో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.