మాచారెడ్డి : ఛత్రపతి శివాజీ పోరాట స్ఫూర్తిని తీసుకుని యువత ముందుకు నడవాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. మాచారెడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చత్రపతి శివాజీ విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశం కోసం త్యాగం చేసిన వీరులను ఎన్నటికీ మరిచిపోరాదని, వారి అడుగుజాడల్లో నడవాలని సూచించారు.
గజ్యానాయక్తండాలో నిర్మించిన సులభ్కాంప్లెక్స్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ లోయపల్లి నర్సింగ్రావు,జడ్పీటీసీ మినుకూరి రాంరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పగడాల బాల్చంద్రం, మండల ప్రధానకార్యదర్శి రాజాగౌడ్, వైస్ఎంపీపీ జీడీపల్లి నర్సింహారెడ్డి, సర్పంచులు హంజీనాయక్, అంబటి లలిత, ఉపసర్పంచ్ తోకల కిషన్, శ్రీధర్రావు, పతిగౌడ్, కిషన్గౌడ్, షేక్అజీజ్, ముస్తాక్హుస్సేన్, శ్రీనివాసాచారి, ముద్రకోల నర్సింలు, హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.