కామారెడ్డి : కొనుగోలు కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించి ధాన్యం కుప్పలు దగ్ధమయ్యాయి. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం ముగ్ధంపూర్లో బుధవారం ఈ ఘటన జరిగింది. ముగ్ధంపూర్ గ్రామశివారులో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసింది.
కొనుగోలు కేంద్రానికి సమీపంలోని ఓ వ్యవసాయ భూమిలో గడ్డికి రైతు నిప్పంటించడంతో మంటలు ధాన్యం కొనుగోలు కేంద్రంలోకి వ్యాపించాయి. చూస్తుండగానే వ్యాపించి పలు ధాన్యం కుప్పలకు నిప్పుంటుకుంది. స్థానిక రైతులు అప్రమత్తమే వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక వాహనంతో సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలు ఆర్పుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.