ఖలీల్వాడి: జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో తాత్కాలిక పద్ధతిన ఉద్యోగులను తీసుకుంటున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ బాలనరేంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేయడానికి పలు విభాగాల్లో ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎంబీబీఎస్ 25, ల్యాబ్ టెక్నిషియన్లు 02, ఫార్మాసిస్టు 05, ఏఎన్ఎం 67 విద్యార్హత కలిగిన అభ్యర్థులకు రేపు 2వ తేదీన ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు డీఎంహెచ్వో కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తామని వెల్లడించారు. అర్హత గల అభ్యర్థులు అన్ని ఒరిజినల్ విద్యార్హత సర్టిఫికెట్లతో పాటు మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్, కుల ధ్రువీకరణ పత్రం, రెండు పాస్పోర్టు సైజు ఫొటోలు, ఒక సెట్ జిరాక్స్తో హాజరు కావాలన్నారు. ఇతర వివరాలకు nizamabad.telangana.gov.in వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.