కోటగిరి: క్రీడల్లో రాణించి పేరుతేవాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పొతంగల్ గ్రామానికి చెందిన జాతీయ ఖోఖో క్రీడాకారుడు వసీంను ఆదివారం వర్ని సీసీడీలో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఇటీవల నేపాల్లో జరిగిన ఖోఖో పోటీల్లో మన దేశం తరుఫున కెప్టెన్గా వ్యవహరించి స్వర్ణ పతకం సాధించాడని పొతంగల్ నాయకులు స్పీకర్కు తెలిపారు.
దీంతో వసీంను స్పీకర్ అభినందించారు. క్రీడల్లో మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పోచారం భాస్కర్రెడ్డి క్రీడాకారుడు వసీంను అభినందించారు. కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ మర్కెల్ గంగాధర్పటేల్, గంట్ల విఠల్, ఎంపీటీసీ కేశ వీరేశం, ఉప సర్పంచ్ సూదం వినోద్, హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.