కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. మాచారెడ్డి మండలం గన్పూర్ స్టేజీ వద్ద వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు వెంట నిలుచున్న వారిపైకి దూసుకెళ్లడంతో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిలో కాకులగుట్ట తండా సర్పంచ్ హేమ్లానాయక్, ఉప సర్పంచ్ నరేశ్ ఉన్నారు. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన కామారెడ్డి ప్రాంతీయ దవాఖానకు తరలించారు. కారు డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.