ఇందూరు, నవంబర్ 29: జగిత్యాల జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంలో ఈ నెల 27 నుంచి 29 వరకు నిర్వహించిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్బాల్ పోటీల్లో జిల్లా జట్లు సత్తాచాటాయి. చాంపియన్షిప్ను కైవసం చేసుకున్నాయని జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.ప్రభాకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.గంగామోహన్ తెలిపారు. జిల్లా బాలికల జట్టు ఫైనల్ మ్యాచ్లో సిద్దిపేట జట్టుపై 7-0 పరుగుల తేడాతో గెలుపొంది టోర్నమెంట్ చాంపియన్గా నిలిచింది. బాలుర జట్టు ఫైనల్లో మెదక్ జిల్లా జట్టుపై 5-2 పరుగుల తేడాతో గెలుపొంది టోర్నమెంట్ చాంపియన్గా నిలిచింది. టోర్నీకి ముఖ్యఅతిథిగా జగిత్యాల జిల్లా డీవైఎస్వో భువనగిరి నరేశ్, సాఫ్ట్బాల్ రాష్ట్ర అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.శోభన్బాబు హాజరై విజేత జట్లకు బహుమతులను అందజేశారు. బాలికల విభాగంలో బెస్ట్ ఆల్ రౌండర్గా జి.శృతి, బెస్ట్ బౌలర్గా పి.శిరీష, (సాంఘిక సంక్షేమ పాఠశాల సుద్దపల్లి), బాలుర విభాగంలో బెస్ట్ ఆల్ రౌండర్గా స్నేహితారెడ్డి, (ఆక్స్ఫర్డ్ హైస్కూల్, బ్రాహ్మణపల్లి) ప్రత్యేక బహుమతులను అందుకున్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యాయా మ ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి మల్లేశ్గౌడ్, వ్యాయామ ఉపాధ్యాయులు సుజాత, నవీన్, వినోద్, లత, నిఖిల, దీప, సంతోష్, దీప, సాఫ్ట్బాల్ అకాడమీ కోచ్లు అనికేత్, నరేశ్ పాల్గొన్నారు.