బీబీపేట్, డిసెంబర్ 26 : మండలంలోని తుజాల్పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు ఆదివారంతో సంపూర్ణమ య్యాయి. ఉదయం పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ మాధవానంద సరస్వతీ స్వామి ఆధ్వర్యంలో యంత్ర, ప్రాణ ప్రతిష్ఠ, ద్వార ప్రతిష్ఠ, బలి, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేసినట్లు సర్పంచ్ సుధాకర్రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ మాట్లాడుతూ.. తన సొంత ఊరికి ఆలయ సముదాయాన్ని ఏర్పా టు చేసి అందులో పలు దేవతామూర్తులను ప్రతిష్ఠించడం, ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం సం తోషంగా ఉందన్నారు. ప్రజ లు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ కుటుంబ సభ్యులు, ప్రముఖ వ్యాపారవేత్త సుభాష్రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్కుమార్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, వైస్ ఎంపీపీ రవీందర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.